వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొద్దిరోజుల క్రితం ‘పవర్ స్టార్’ అనే టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించారు. అలాగే ఆ మూవీలోని హీరోని కూడా పరిచయడం చేశారు. ఆ హీరోకి ఎవరైనా స్టార్ హీరో పోలికలు ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే అని చెబుతుంటారు వర్మ. గురువారం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో హీరో ఆలోచిస్తూ కూర్చొని ఉండగా.. దానితో పాటు వర్మ పోస్టర్ పై ఎన్నికల […]
ఉజ్జయిని: 60 కేసుల్లో నిందితుడైన వికాస్ దుబేను పోలీసులు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఆలయం బయట అరెస్టు చేశారు. అయితే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా.. వికాస్ దుబే పెద్ద పెద్దగా కేకలు వేశాడు. ‘నేను వికాస్ దుబేను.. కాన్పూర్ వాలాను’ అంటూ పోలీసుల ముందు అరిచాడు. వికాస్ను పోలీసులు కారులోకి ఎక్కిస్తుండగా అతడు కేకలు వేసిన వీడియోలు బయటికి వచ్చాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఆలయంలో దగ్గర ఒక షాప్లో పూజ సామగ్రి కొన్న దుబేను ఆ షాప్ […]
సారథి న్యూస్, రామడుగు: కరోనాతోపాటూ అన్ని రకాల రోగాలు దరిచేరకుండా ఉండాలంటే వ్యాయమం ఎంతో అవసరమని సూచిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన యువకులు ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఓ గంట సేపు అందరూ వ్యాయామం చేసేలా ‘ఫిట్రామడుగు’ అనే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో చేరిన యువకులంతా ప్రతి రోజు స్థానిక ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో వాకింగ్, రన్నింగ్, యోగా చేస్తున్నారు. అంతేకాక వీరు ఓ వాట్సప్గ్రూప్ను […]
రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న ఎన్టీఆర్ నిజమైన పులితో ఫైట్ చేస్తున్నాడట. ఈ చిత్రంలో కొమరం భీమ్గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘పులిని దూరం నుంచి చూడాలనిపిస్తే చూసుకో..పులితో ఫొటో దిగాలనిపిస్తే కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ట్రై చేయెచ్చు. అదే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది’ యమదొంగ సినిమాలోని ఈ డైలాగ్ ఎన్టీఆర్ అభిమానులకి బాగా గుర్తుండిపోయింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్ ఇప్పటికే లీకై […]
‘ఆర్ఎక్స్100’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్గ్లామరే ప్రధానంగా నటిస్తూ ఉన్న పాయల్ హఠాత్తుగా కంటెట్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తానంటోంది. అయితే రీసెంట్గా పాయల్ రెండు భారీ చిత్రాల్లో ప్రత్యేక గీతాలు చేయనుందనే వార్త వైరల్ అయితే ఆ సినిమాలు నేను చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ సమయంలో ప్రస్తుతం తను స్ర్కిప్టులు వినే పనిలో ఉన్నానని, నా క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమా చేస్తానని.. గ్లామర్ కంటే […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గడం లేదు. తాజాగా గురువారం 1,410 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు 30,945కు చేరాయి. తాజాగా ఏడుగురు మృతి, ఇప్పటి వరకు 331 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 918 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 125 కేసులు, మేడ్చల్ జిల్లాలో 67, సంగారెడ్డి 79, వరంగల్ అర్బన్జిల్లాలో 34 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,40,755 కరోనా పరీక్షలు నిర్వహించారు.
సారథిన్యూస్, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ఎంటరయ్యారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు అటవీప్రాంతంలో మూడు మావోయిస్టు బృందాలు తిరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినవస్తుంది. మణుగురు అటవీప్రాంతంలో మావోయిస్టులు తిరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మణుగురు అటవీ ప్రాంతాన్ని 20 ప్రత్యేకబృందాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ప్రాంతంలోని వ్యక్తులపై ఏ మాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సుమారు 400 మంది పోలీసులు మావోయిస్టుల కదలికలపై ముమ్మరంగా గాలిస్తున్నారు.
సారథిన్యూస్, చేవెళ్ల: భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ సీఐ శంకరయ్య ఓ వ్యక్తికి సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. లక్ష 20వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం షాబాద్ పీఎస్లో శంకరయ్య యాదవ్, ఏఎస్సై రాజేందర్.. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీఐ శంకరయ్యపై గతంలోనూ అవినీతి కేసులున్నాయి. రంగారెడ్డి […]