Breaking News

Month: July 2020

దంచికొడుతున్న వానలు

దంచికొడుతున్న వానలు

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 13.6 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి నదిలోకి 74,723 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇలా ఉండగా, పాల్వంచ మండలంలో కురుస్తున్న భారీవర్షాలకు లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా […]

Read More
సచివాలయం కూల్చివేతపై విచారణ

సచివాలయం కూల్చివేతపై విచారణ

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ సచివాలయ కూల్చివేతపై బుధవారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. భవనాల కూల్చివేత ద్వారా ఐదులక్షల మందికి శ్వాస ఇబ్బందులు ఎదురవుతాయని ప్రొఫెసర్​విశ్వేశ్వర్ ఫిటిషన్ దాఖలు చేశారు. అన్ని అనుమతులు తీసుకునే సెక్రటేరియట్​భవనాల కూల్చివేత పనులు చేపడుతున్నామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. కేబినెట్​నిర్ణయం తీసుకున్న ఫైనల్ రీపోర్ట్ కాపీని షీల్డ్ కవర్​లో ఏజీ కోర్టుకు సమర్పించారు. 25 ఎకరాల్లో ఉన్న సచివాలయంలో 11 బ్లాక్ లు ఉన్నాయని, ఇందులో ఎలాంతో ఫైర్ సేఫ్టీ […]

Read More
బిరబిరా కృష్ణమ్మ

బిరబిరా కృష్ణమ్మ

సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. బుధవారం జూరాలకు 40,076 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోని ఆరుగేట్ల ద్వారా 8,956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కోసం మరో 16,162 క్యూసెక్కులను వినియోగిస్తూ జూరాల నుంచి మొత్తంగా 25,118 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్​కు […]

Read More

పోలీస్ ఆఫీసర్ గా చేయాలనుంది

అభిమానులతో ఎప్పుడూ టచ్​లో ఉండే యంగ్ హీరో సందీప్ కిషన్ ఇన్ స్టాగ్రామ్ లో ఈసారి అతని సినిమా విషయాలతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చెప్పాడు. ప్రస్తుతం తను చేస్తున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ రీమేక్ మూవీ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నాడు. టీజర్ చూస్తే ఎవరూ అలా అనుకోరు.. కానీ టీజర్ రిలీజ్ చేయాలంటే కొన్నిరోజులు పడుతుందని.. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టు చెప్పాడు. రీసెంట్ గా ఈ మూవీకోసం […]

Read More

లవ్.. రొమాంటిక్​లో మిల్క్​బ్యూటీ

టాలీవుడ్ లో వరుసగా పొరుగు భాషా చిత్రాలు రీమేక్​ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘లవ్ మాక్ టైల్’ రీమేక్ కు తెలుగు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. శాండిల్ వుడ్​లో రీసెంట్ బ్లాక్ బ్లస్టర్ ‘లవ్ మాక్ టైల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ నాగశేఖర్. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నారట. యాక్టింగ్​తోపాటు డ్యాన్స్ లో కూడా తమన్నా పెర్ఫామెన్స్ అదురుతుంది. పూర్తిగా లవ్ యూత్​ […]

Read More

తమిళ చిత్రంలో స్వీటీ

గౌతమ్ మీనన్​దర్శకత్వంలో 2006లో వచ్చిన క్రైమ్ థిల్లర్ ‘వేట్టైయాడు వేళైయాడు’ సినిమా తెలుగులో ‘రాఘవన్’గా విడుదలైంది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సీఫీస్​కి మంచి కలెక్షన్లనే తీసుకొచ్చింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు గౌతమ్ మీనన్. కమల్ కి జంటగా ఇప్పుడు అనుష్కను సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం అనుష్క ప్రధానపాత్రలో క్రైమ్ అండ్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రం కరోనా కారణంగా రిలీజ్​కు నోచుకోలేదు. అనుష్క ఈ చిత్రంలో […]

Read More

‘నవరస’ సిరీస్​లో స్టార్ హీరో

బాలీవుడ్ హీరోలు పలువురు ఓటీటీ బాటపడుతుండగా..సౌత్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో మూవీ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధంగా లేరు. ఇదే సమయంలో తెలుగు.. తమిళ హీరోలు వెబ్ సిరీస్ ల్లో నటించడం అంటే తమ స్థాయిని తగ్గించుకోవడం అన్నట్లుగా అభిప్రాయంలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోలు పలువురు వెబ్ సిరీస్ లు చేస్తుంటే ఇప్పటి వరకు ఎవరు కూడా సౌత్ హీరోలు వెబ్ సిరీస్ లకు ముందుకు రాలేదు. మొదటి సారి […]

Read More

కరోనాతో ట్రాఫిక్ సీఐ మృతి

సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా నిధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం మృతిచెందారు. స్థానిక సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన కితాబిచ్చారు. సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.

Read More