సారథి న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో తప్పనిసరిగా మాస్క్ కట్టుకోవాల్సిందేనని వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ సూచించారు. రోజు రోజుకు విస్తరిస్తున్న వ్యాధిని నియంత్రించడం కోసం ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వ ఇచ్చిన అదేశాలను గౌరవిస్తూ ప్రజలు తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు సమాజ పరిరక్షణకు కృషిచేయాలన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగితే డిజాస్టర్ మెనేజ్ మెంట్ యాక్ట్ 51(బి) మేరకు కేసులు […]
సారథి న్యూస్, మెదక్: ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. శంకుస్థాపన చేసిన ఐదేళ్ల తర్వాత ప్రధానమైన ఆనకట్ట ఎత్తు పెంపు పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్ ఉండటంతో అసలు ఆనకట్ట ఎత్తు పెంపు పనులు జరుగుతాయా? లేదా? అన్న సందేహంలో ఉన్న వేలాది మంది ఆయకట్టు రైతులకు ఊరట కలిగినట్టయింది. ఆనకట్ట ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి అదనంగా ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.నిజాం నవాబుల కాలంలో […]
ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలతకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఫేస్బుక్లో పోస్టుచేశారు. ‘శనివారం నుంచి తలనొప్పి, గొంతునొప్పితో బాధపడుతున్నాను. దీంతో అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హోంక్వారంటైన్లోనే ఉన్నాను. డాక్టర్ల సూచనలతో మందులు వాడుతున్నాను. త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. కరోనా సోకినవారెవరూ ఆందోళన చెందొద్దని.. ధైర్యంగా ఉండి మందులు వాడాలని సూచించారు.
సారథి, హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో రూ. 6600 విలువైన గుట్కాప్యాకెట్లను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని ఓ ఇంట్లో గుట్కాప్యాకెట్లు నిలువ ఉంచినట్టు పోలీసులకు సమాచారమందింది. దీంతో తనిఖీలు చేసిన అధికారులు గోర్ల శ్రీనివాస్ ఇంట్లో అంబర్ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ కు సహాకరించిన బొయిని వేణుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సారథి న్యూస్, మెదక్: జిల్లాను పారిశుద్ధ్యంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచేలా లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కోరారు. సోమవారం సిద్దిపేట నుంచి మెదక్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకుంఠధామాలు, రైతు వేదికలు, డంపింగ్యార్డులు, రైతు కల్లాలపై ఆరాతీశారు. ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో పనుల పురోగతి బాగుందని, మరికొన్ని మండలాల్లో చాలా వెనకబడి ఉన్నారని అన్నారు. ఒకరిద్దరు సర్పంచ్లతో […]
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు అభివృద్ధికి అడ్డుగా మారిన వైరస్ తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీకి చెక్ సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు పెరగడంలో పలు జిల్లాలు పోటీపడుతున్నాయి. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు కట్టుకోకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి. మార్చి 25 నుంచి మే 30వ తేదీ వరకు లాక్ డౌన్ విధించినప్పుడు నియంత్రణలో ఉన్న కరోనా వైరస్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత పంజా విసిరింది. […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు హౌసింగ్ కార్పొరేషన్ లో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఎం నగర కార్యదర్శి టి.రాముడు డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లు లేని పేదల సొంతింటి కల నెరవేరాలని సీఎం జగన్30లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అభినందిస్తూ, ఇంకా చాలా మంది అర్హులైన పేదలు ఉన్నారని గుర్తుచేశారు. ఎంఏ గఫూర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2006 నుంచి 2009 […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా(కోవిడ్19) కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. సోమవారం రాష్ట్రంలో కొత్తగా 1,831 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసులు 25,733కు చేరాయి. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 1,22,218 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు 306 మంది మృత్యువాతపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,419 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 160, మేడ్చల్ జిల్లాలో 117 కేసులు, మెదక్లో 20, మంచిర్యాల జిల్లాలో 20, ఖమ్మం […]