జైపూర్: రాజస్థాన్లో రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గవర్నర్తో కలిసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని కాంగ్రెస్ విమర్శించగా.. బీజేపీ ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం వైపు నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో శనివారం బీజేపీ డెలిగేషన్ భేటీ అయింది. అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. గవర్నర్ను రాజ్యాంగ పరంగా పనిచేయకుండా కాంగ్రెస్ నేతలు […]
హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రోగుల ప్రాణాలు కాపాడాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్లాస్మాను దానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు మెగాస్టార్ శనివారం ట్వీట్ చేశారు. ‘కరోనాను జయించిన వారికి ఇదే నా అపీల్. రికవరీ అయిన వాళ్లు ముందుకు వచ్చి ప్లాస్మాను డొనేట్ చేయండి. ప్రాణాలను కాపాడండి. మహమ్మారి ప్రబలుతున్న వేళ ఇంత కంటే మానవత్వం ఇంకోటి లేదు. కరోనా వారియర్స్ ఇప్పుడు ప్రాణ […]
అయోధ్య : యావత్ ప్రపంచం గర్వించేలా అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. శనివారం ఆయన అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలోని రామ మందిరం, హనుమాన్ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆగస్టు 5న జరగనున్న శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆ కార్యక్రమం గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయోధ్య దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. “ ప్రధాని మోడీ అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నారు. కచ్చితంగా అయోధ్యని దేశం, […]
న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా అనేక మలుపులు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయం రెండోసారి సుప్రీం కోర్టుకు చేరింది. సచిన్ పైలెట్, 19 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ముగ్గురు జడ్జిల బెంచ్ సోమవారం దాన్ని విచారించనున్నారు. ఈ పిటిషన్ను విచారించనున్నట్లు శనివారం సాయంత్రం రిలీజ్ చేసిన లిస్ట్లో ఉంది. […]
బళ్లారి: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా విస్తుగొలుపే వార్త. వందేళ్లు నిండిన ఓ బామ్మ కరోనాకు సోకింది. ఇంకేముంది కుటుంబసభ్యులు ఆశలు వదులుకున్నారు. కానీ విచిత్రంగా ఆ వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నది. దీంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వ వైద్యులు ఆమెను ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు కోలుకున్నది. తాను […]
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని 1 నుంచి 12 వ తరగతి వరకు 25 శాతం వరకు సిలబస్ను తగ్గించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎంఎస్సీఈఆర్టీ) ఆమోదం తెలిపింది. 2020-21 విద్యాసంవత్సరంలో సిలబస్ కోతను విధించనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా ఇప్పటికే 9 నుంచి 12 […]
సారథిన్యూస్, రామడుగు: రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ విస్తీరణాన్నీ 33 శాతానికి పెంచాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వనాన్ని తలపించేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో రామడుగు తహసీల్దార్ చింతల కోమల్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్రావు, వివిధ […]
సారథి న్యూస్, మెదక్: జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గేలా చూడాలని వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి కలెక్టర్ఎం.ధర్మారెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాలోని ఆయా ఆస్పత్రుల డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ఎప్పడికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. కాన్పు సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా రక్తం ఉండేలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, ఈవోఎంహెచ్ఎన్ సుమిత్రారాణి, అదనపు జిల్లా వైద్యాధికారి రాజు, జిల్లా సర్వేలైన్స్ ఆఫీసర్ డాక్టర్ మల్కాజి […]