సారథి న్యూస్, హైదరాబాద్: గిరిజనుల హక్కుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టంచేశారు. జీవోనం.3ను కొనసాగించేలా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. గురువారం మాసాబ్ట్యాంక్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్ ఉద్యోగాలను వందశాతం గిరిజనులతోనే భర్తీ చేసేందుకు 2000లో ఇచ్చిన జీవోనం.3ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం దురదృష్టకరమన్నారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: ‘పుడమి పచ్చగా ఉండాలే.. మన బతుకులు చల్లగా ఉండాలే’ అనే నినాదంతో ఎంపీ(రాజ్యసభ) జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ 3వ దశకు చేరింది. గురువారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడోదశ గ్రీన్ ఇండియా చాలెంజ్ కు శ్రీకారం చుట్టారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉన్నతమైన విలువతో కూడుకున్నదని అన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,320 పాజిటివ్ కేసులుగా తేలాయి. ఇప్పటివరకు 165 మంది మృతిచెందారు. చికిత్స అనంతరం 1993 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2162కు చేరింది. జీహెచ్ఎంసీ నుంచి అత్యధికంగా 143, మేడ్చల్ జిల్లాలో 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8, మహబూబ్ నగర్ 4, మెదక్ 3, జగిత్యాల జిల్లాలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉండగా, హైదరాబాద్ […]
సారథి న్యూస్, వనపర్తి: మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యుల జీవనోపాదుల సర్వేను రెండు రోజుల్లో కంప్లీట్ చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం పలు పథకాలపై సమీక్షించారు. కోవిడ్ రుణాలకు సంబంధించి 5,445 సంఘాలకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 533 సంఘాలకు రూ.3.14 కోట్లు మాత్రమే ఇచ్చామని తెలిపారు. బ్యాంకుల అనుసంధానంతో అమలుచేసే పథకాలను కలెక్టర్ సమీక్షిస్తూ ఈ నెలాఖరు నాటికి రూ.16.8కోట్ల రుణం ఇవ్వాల్సి […]