టీ20 ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే.. మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారత్ జట్టు పూర్తిస్థాయి షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. మూడు టీ20లు, నాలుగు టెస్ట్లు, మూడు వన్డేలకు సంబంధించిన తేదీలు, వేదికలను వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ 11తో ఈ పర్యటన మొదలవుతుంది. మధ్య మధ్య బ్రేక్లతో వచ్చే ఏడాది జనవరి 17తో ముగుస్తుంది. ఓవరాల్గా అక్టోబర్, నవంబర్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే తమ ఆరునెలల సమ్మర్ షెడ్యూల్ను సీఏ ప్రకటించడం గమనార్హం. దీంతో […]
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ను వాయిదా వేస్తారని ఊహాగానాలు వచ్చినా.. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్న గవర్నింగ్ బాడీ తమ నిర్ణయాన్ని వచ్చేనెల 10కు వాయిదా వేసింది. అప్పటివరకు పరిస్థితులపై భాగస్వాములతో చర్చించాలని నిర్ణయించింది. ఆ తర్వాతే మెగాఈవెంట్స్పై తుదినిర్ణయం తీసుకోనుంది. మూడు రోజుల పాటు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సుదీర్ఘమైన చర్చలు జరిగినా తమ షెడ్యూల్స్కు సంబంధించి ఐసీసీ ఎటూ తేల్చుకోలేకపోయింది. […]
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఢిల్లీ–గుర్గావ్ రోడ్ను క్లోజ్ చేసింది. కాగా కేవలం కార్లను మాత్రమే అనుమతిస్తుండడంతో ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమను పనులకు పంపించాలని, నడిచి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో హర్యనా ఢిల్లీ బోర్డర్లో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయియి. నడిచి వెళ్లేవారు, సైకిళ్లపై పనులకు వెళ్లేవాళ్లను కూడా అనుమతించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్: ఇండియా, చైనా మధ్య బోర్డర్లో తలెత్తిన గొడవను క్లియర్ చేసేందుకు తాను సిద్ధమని, దాని కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోడీ ఈ విషయంపై మాట్లాడే మూడ్లో లేరని ఆయన చెప్పారు. గురువారం ఆయన వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. లద్దఖ్లోని ప్యాంగాంగ్ లేక్ ఏరియాలో చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. […]
టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏదో ఓ దశలో ఐపీఎల్ జరిగితేనే మంచిదని టీమిండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ కోరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహించినా ఫర్వాలేదని కుంబ్లే అన్నాడు. ఈ ఆలోచన తప్పు కాదన్నాడు. ‘ఐపీఎల్ జరగాలని నేను బలంగా కోరుకుంటున్నా. అంతర్జాతీయ షెడ్యూల్ను సమీక్షిస్తే ఈ ఏడాది లీగ్ కు సమయం లభిస్తుందని భావిస్తున్నా. ఒకవేళ ప్రేక్షకులకు అనుమతి లేకుంటే.. నాలుగు […]
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్. ధోనీ రిటైర్మెంట్ విషయం మరోసారి చర్చకు వస్తున్న వేళ.. భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో ఎంతో సాధించిన మహీకి.. ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసన్నాడు. ఇందులో ఎవరూ బలవంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. తన వీడ్కోలు విషయంలో నిర్ణయం తీసుకునే హక్కును అతను సంపాదించుకున్నాడని స్పష్టం చేశాడు. ‘ధోనీ అద్భుతమైన క్రికెటర్. అతని మేధస్సు, ప్రశాంతత, పవర్, అథ్లెటిక్స్ నైపుణ్యం, వేగం […]
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో 36వ జాతీయ క్రీడలు మరోసారి వాయిదా పడ్డాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో అథ్లెట్ల ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టొద్దనే ఉద్దేశంతో క్రీడలను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు గోవాలో ఈ క్రీడలు జరగాల్సి ఉన్నాయి. గతంలో క్రీడల నిర్వహణపై భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ).. గోవా ప్రభుత్వంతో చర్చలు […]
ఐవోసీ సభ్యులతో థామస్ బాచ్ చర్చలు లుసానే: టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేసిన తర్వాత.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) చీఫ్ థామస్ బాచ్.. తొలిసారి తమ సభ్యులతో వరుసపెట్టి చర్చలు జరిపారు. వైరస్ వ్యాప్తి, కంట్రోలు, ఒలింపిక్స్ నిర్వహణపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. భాష, టైమ్ జోన్ ప్రకారం సుమారు వంద మంది ఐవోసీ సభ్యులతో మాట్లాడారు. ‘ఒలింపిక్ సీజన్ ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరిపాం. టోక్యో ఒలింపిక్స్పై ఎలా ముందుకెళ్లాలి. సన్నాహాకాలు, క్వాలిఫయింగ్ […]