Breaking News

రామడుగు

పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలి

పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలి

సారథి, రామడుగు: నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు మండలంలోని వెదిర, దేశరాజ్ పల్లి గ్రామాల్లో ఎండిన పంట పొలాలను స్థానిక సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. వెదిరలో రామారావు అనే రైతుకు చెందిన మూడెకరాల పొలం ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని, ఎంతో శ్రమటోడ్చి పంట వేస్తే ఇలాంటి దుస్థితి వచ్చిందన్నారు. పంటలు ఎండిపోయినా, […]

Read More
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బీజేపీ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బీజేపీ

సారథి, రామడుగు: దేశ సంస్కృతి సంప్రదాయాలకు బీజేపీ ప్రతీక అని రామడుగు పార్టీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రంలో పార్టీ జెండాను ఎగరవేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ర్టాల్లో కాషాయ జెండా ఎగరడం కాయమన్నారు. కార్యక్రమంలో కారుపాకల అంజి, సంటి జితేందర్, కొలపురి రమేష్, జిట్టవేని అంజిబాబు, దురుశెట్టి రమేష్, రాంలక్ష్మణ్, మాడిశెట్టి అనిల్, రాగం కనకయ్య, నీలం లక్ష్మీరాజాం, పరశురాం, అంజి పాల్గొన్నారు.

Read More
నిర్వాసితులకు న్యాయం చేయండి

నిర్వాసితులకు న్యాయం చేయండి

సారథి, రామడుగు: మండలంలోని దేశరాజుపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి ‌‌–మనోహరాబాద్ రైల్వే లైన్ భూ బాధితులకు న్యాయం చేయాలని ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు వంచ మహేందర్ రెడ్డి గ్రామ భునిర్వాసితులతో కలసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్​ను క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో పెద్దపల్లి –నిజామాబాద్ రైల్వే లైన్ లో భూములు, ఇండ్లను కోల్పోయి ఆ రైల్వే లైన్ పక్కనే భూమి కొనుగోలుచేసి నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మళ్లీ […]

Read More
అ‘పూర్వ’ సమ్మేళనం

అ‘పూర్వ’ సమ్మేళనం

సారథి, రామడుగు: రామడుగు జడ్పీ హైస్కూల్ లో చదువుకున్న 1990-1991 పదవ క్లాస్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కరీంనగర్ లోని వీపార్క్ హోటల్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత అందరూ ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో గోపాల్ రావుపేట ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్​ఎస్ సీనియర్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవేల్లి నరేందర్ రెడ్డి, గోలిరామయ్యపల్లి […]

Read More
చొప్పదండి సీఐకి సన్మానం

చొప్పదండి సీఐకి సన్మానం

సారథి, రామడుగు: రామడుగు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చొప్పదండి సీఐ నాగేశ్వర్ రావును ఘనంగా సన్మానించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలసి మండలంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఐ సమస్యల పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంచే రాజిరెడ్డి, గౌరవాధ్యక్షుడు గంటే భాస్కర్, ప్రధాన కార్యదర్శి కాసరపు తిరుపతి గౌడ్, సభ్యులు […]

Read More
క్రీడలతో మానసిక ఉల్లాసం

క్రీడలతో మానసిక ఉల్లాసం

సారథి, రామడుగు: క్రీడలు మానసిక వికాస అభివృద్ధికి తోడ్పడుతాయని సర్పంచ్ పంజాల ప్రమీల అన్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గడికోట క్రీడామైదానంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ గురువారం నిర్వహించారు. క్రీడలు వ్యక్తి మానసిక పరిపక్వతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడు స్నేహభావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, ఉపసర్పంచ్ వడ్లూరి రాజేందర్, కార్యదర్శి మధుసూదన్, మాజీ సర్పంచ్ పంజాల జగన్ మోహన్, మాజీవార్డు సభ్యులు ఐతరవేని […]

Read More
బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

సారథి, రామడుగు: సమగ్ర బాలల సంరక్షణ పథకంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం మండలంలోని వెదిర గ్రామంలో గురువారం గ్రామస్థాయి బాలాల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందులో మొత్తం 16 మంది సభ్యులు వీరిలో సర్పంచ్ చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్​ అధికారి కవిత, సర్పంచ్ తీగల సంగీత, వార్డు సభ్యులు, కార్యదర్శి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, జడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ కమల […]

Read More
గ్రామాలను సందర్శించిన సర్పంచ్​లు

సర్పంచ్​లు గ్రామాల సందర్శన

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్​లు, కార్యదర్శులు అభివృద్ధి చెందిన గ్రామాన్ని సందర్శిస్తారని ఎంపీడీవో మల్హోత్ర తెలిపారు. అందులో భాగంగానే బుధవారం వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన వెలిచాల గ్రామానికి ఎంపీపీ, జడ్పీటీసీ వస్తారని తెలిపారు. కావునా మండలంలోని సర్పంచ్​లు, కార్యదర్శులు హాజరుకావాలని ఎంపీడీవో తెలిపారు.

Read More