సారథి న్యూస్. రామగుండం: సింగరేణి వార్షిక లాభాల్లో కార్మికులకు వాటా ఇప్పించడానికి కృషి చేస్తున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్తో మాట్లాడతామని చెప్పారు. మంగళవారం లాంగ్వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన సమావేశంలో వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2400 మంది బదిలీ వర్కర్ లను జనరల్ మజ్దూర్ గా ప్రమోషన్ సాధించి ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్ దే […]
సారథిన్యూస్, రామగుండం: సింగరేణి యాజమాన్యం ఇష్టానుసారం కార్మికులను బదిలీ చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. అక్రమ బదిలీలను వెంటనే ఆపకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఆర్జీవన్ డివిజన్లోని జీకే ఓకటో గని కార్మికులను యాజమాన్యం ఎందుకు బదిలీ చేస్తున్నదని ప్రశ్నించారు. శనివారం ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒకటో గనిలో కార్మికులు అవసరం ఉన్నప్పటికీ యజమాన్యం పద్ధతి లేకుండా కార్మికులను అడ్డాయలప్రాజెక్టుకు ఆర్జీ3కి బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. […]
ముంబై : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఐటీ ముంబై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం నుంచి కేవలం ఆన్లైన్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాసులు వినేందుకు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని దాతలను కోరింది. వారు ఆన్లైన్ చదువులు కొనసాగించటానికి అవసరమైన ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ కనెక్షన్లు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవసరమవుతాయని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విన్నవించింది.