సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయం ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దాలని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు ఆకాంక్షించారు. శుక్రవారం నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్, అధ్యాపకులు భాస్కరాచారి హైదరాబాద్ లో ఆయనను కలిసి బొకే ఇచ్చి, శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ.. వట్టెం నవోదయ విద్యాలయంలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడి గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. […]
నివాళులర్పించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సారథి, వెల్దండ: కల్నల్ సంతోష్ కుమార్ త్యాగం వృథాకాదని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ కొనియాడారు. చైనా, భారత సరిహద్దులో దేశరక్షణ కోసం యుద్ధరణరంగంలో అసువులుబాసిన ఆయనను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కల్నల్ సంతోష్ కుమార్ అమరత్వానికి ప్రతీకగా మంగళవారం వెల్దండ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సంతోష్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి […]
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లుతో సామాజిక న్యాయం దక్కుతుందని టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. లోక్సభలో శుక్రవారం జరిగిన చర్చలో ఎంపీ రాములు మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ అంశం పెండింగ్లో ఉందన్నారు. విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల చట్టం ప్రకారం 2000లో 59 షెడ్యూల్డు కులాలను వర్గీకరించిందన్నారు. 2004 వరకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. కానీ సుప్రీంకోర్టు […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: కల్వకుర్తి నేషనల్హైవే 167 నుంచి నాగర్ కర్నూల్, కొల్లాపూర్, సోమశిల, ఆత్మకూరు, కరివేన నేషనల్హైవే 340 ను కలుపుతూ తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా నూతన జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని మంగళవారం నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు నేషనల్రోడ్డు ట్రాన్స్పోర్ట్, హైవేస్ సెక్రటరీ గిరిధర్ను కలిసి కోరారు. గద్వాల జిల్లా ఎర్రవెల్లి చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కోసం డీపీఆర్ను త్వరితగతిన పూర్తిచేసి పనులు ప్రారంభించాలన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో […]
సారథి న్యూస్,నాగర్కర్నూల్: అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణకు ‘దిశ’ చక్కని వేదిక అని నాగర్ కర్నూల్ ఎంపీ, ‘దిశ’ కమిటీ చైర్మన్ పోతుగంటి రాములు అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తిరుమల టవర్స్ లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం ఎంపీ అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ.. దిశ కమిటీ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు ఖర్చు, పథకాలు అమలు తదితరాలను […]