సత్కవి గుర్రం జాషువా భారతరత్న డాక్టర్బాబాసాహెబ్ అంబేద్కర్ సమకాలికుడు. అంబేద్కర్ కంటే నాలుగేళ్లు చిన్నవాడు. అస్పృశ్యతను చవిచూసిన ఈ కవిరేణ్యుడు తన ఖండ కావ్యం ‘గబ్బిలం’ లో నాటి సామాజిక వ్యవస్థ మూలాలు, అమానవీయ దౌష్ట్యాన్ని కరుణారస భరితంగా వర్ణించి సాహిత్య వేదికపై మానవ జాతిని మేలు కొల్పిన సంఘసంస్కర్త. మరీ ముఖ్యంగా అరుంధతీయుల దుర్భర జీవనగతులను ‘ప్రశ్నించే చైతన్యం’తో అనుసంధించి సమర సతాత్మక ప్రబోధంతో సమాజాన్ని తట్టిలేపిన విశ్వనరుడు. జాతీయోద్యమం స్ఫూర్తితో దేశభక్తి కొత్తపుంతలు తొక్కుతున్న […]