మాకు నిర్ణయాధికారం ఇవ్వరా? ఐరాస వీడియోకాన్ఫరెన్స్లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్కు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో నిర్ణయాధికారం నుంచి ఇంకెంతకాలం దూరంగా ఉంచుతారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశ్నించారు. ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా ఐరాస అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐరాసలో సంస్కరణలు చేయాలని భారత్ ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని అన్నారు. అయితే అవి ఎప్పటికీ కార్యరూపం దాల్చుతాయోననీ, […]
ఐరాస: కోవిడ్-19 కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కరువై పేదలు మరింత దారిద్ర్యం బారినపడుతున్నారు. కరోనా వల్ల 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.7 కోట్ల మంది మహిళలు అత్యంత పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. పేదరికాన్ని అంతమొందించేందుకు దశాబ్ద కాలంగా తాము చేస్తున్న కృషి వృథా అయిందని ఆందోళన వ్యక్తం చేసింది. 2019-2021 మధ్య కాలంలో మహిళల్లో పేదరికం 2.7 శాతం ఉంటుందని గతంలో అంచనా వేయగా, తాజాగా దాన్ని సవరిస్తూ 9.1 […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఫలానా పట్టణంలో బాలిక అదృశ్యం.. ఫలానా గ్రామం నుంచి కనిపించకుండాపోయిన ఇద్దరు మహిళలు. పాఠశాల నుంచి మాయమైన విద్యార్థినులు.. ఇలాంటి వార్తలు ప్రతిరోజూ పేపర్లు, టీవీల్లో చూస్తూనే ఉంటాం. ఇలా ఇంటినుంచి మాయమైన వారు దేశం మొత్తంలో లక్షో, పదిలక్షల మందో ఉంటారని అనుకుంటాం. కానీ, ఈ 50ఏళ్ల కాలంలో అలాంటివారు నాలుగు కోట్ల 58లక్షల మంది ఉన్నారట. అది కూడా మహిళలు. ఇంతమంది కనిపించకుండా పోయారట. ఇది కేవలం ఇండియాలోనే. వినడానికి […]
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా టీచర్ను ఐక్యరాజ్య సమితి వక్తగా ఆహ్వానించింది. కోవిడ్–19ను సమర్థవంతంగా ప్రతిఘటించినందుకు యూఎన్వో(యునైటెడ్ నేషన్స్ఆర్గనైజెషన్) నిర్వహించే ప్రజాసేవా దినోత్సవంలో ఆమె ప్రసంగించనున్నారు. కరోనాపై యుద్ధంలో సీపీఎం నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆ చర్యలను ప్రపంచదేశాలకు మంత్రి వివరించనున్నారు.