సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కోరలు చాచింది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ.. ఈజీగా మింగేస్తోంది. ఆదివారం కొత్తగా 983 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,418కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా నలుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు 247 మంది చనిపోయారు. యాక్టివ్కేసులు 9 వేలు ఉన్నాయి. చికిత్స అనంతరం 5172 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో 816, రంగారెడ్డి జిల్లాలో 47, మేడ్చల్ జిల్లాలో 29 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి.
సారథిన్యూస్, రామడుగు: జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతులు కల్లాలు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కరీంనగర్ జిల్లా రామడుగు మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబోసుకోటానికి ఈ కల్లాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కల్లాలకు చిన్న సన్నకారు రైతులు అర్హులని పేర్కొన్నారు. 50 చ.మీ కల్లాలకు రూ. 56 వేలు, 60 చ. మీ రూ. 68 వేలు, 75 చ.మీ రూ. 85వేలు నిర్ధారించారని చెప్పారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో మే చివరి దాకా రాత్రిపూట కర్ఫ్యూతో కొన్ని నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. జూన్ తేదీ నుంచి లాక్డౌన్ను పూర్తిగా ఎత్తేశారు. మరోవైపు 8వ తేదీ నుంచి సినిమా థియేటర్లు, పాఠశాలలు మినహా షాపింగ్ మాల్స్, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో వ్యాపారాలు, క్రయ విక్రయాలు క్రమక్రమంగా ఊపందుకుంటాయని అందరూ భావించారు. తద్వారా పన్నుల రూపంలో ఖజానాకు రాబడి ప్రారంభమవుతుందనీ, ఈనెల చివరి […]
ప్రశ్నిస్తున్న బాలకేంద్రాల్లోని పార్ట్ టైం, కాంట్రాక్టు ఉద్యోగులు 20 ఏళ్ల సీనియారిటీ.. రూ.3వేలు, రూ.4వేల జీతాలే పిల్లల ఆటాపాటలు, బహుమతులకు డబ్బులు కరువు ‘తెలంగాణ ఎప్పటికీ ధనిక రాష్ట్రమేనని.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. డబ్బులకు కొదవలేదు..’ 6వ విడత హరితహారం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట ఇది.. ‘మేం ప్రతి జాతీయ పండగను ఘనంగా జరుపుకుంటాం. పిల్లల చేత నాటికలు, నాటకాలు, ఏక పాత్రాభినయాలూ చేయిస్తాం. మహనీయుల పుట్టిన రోజులు, ప్రముఖుల వర్ధంతుల సందర్భంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణలో శనివారం 1087 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొదటిసారి వెయ్యి కేసులు దాటాయి. వ్యాధి బారినపడి ఆరుగురు మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 888, రంగారెడ్డి 74, మేడ్చల్ 37, నల్లగొండ 35.. ఇలా రాష్ట్రంలో మొత్తం 13,436 పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు 243 చనిపోయారు.
సారథి న్యూస్ చొప్పదండి: బతుకుదెరువులేక దుబాయ్ వెళ్లిన ఓ కార్మికుడి జీవితం అత్యంత విషాదంగా ముగిసింది. కరోనా లక్షణాలతో అతడు ప్రాణాలు కోల్పోగా అయినవాళ్లేవరూ లేకుండానే అంతిమ సంస్కారాలు జరుపవలసిన పరిస్థితి నెలకొన్నది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన క్యాదాసు కొండయ్య కొన్నేండ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. కరోనాతో బాధపడుతూ 10 రోజుల క్రితం అబుదాబి క్యాంప్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ దృష్టికి […]
సారథి న్యూస్, చొప్పదండి: కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతున్నా.. రైతులకు రైతుబంధు డబ్బులను ఇచ్చిన ధీశాలి కేసీఆర్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. ప్రతిరైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని వరలక్ష్మి పంక్షన్హాల్లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకోసం నిర్మించనున్న కల్లాల నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. కల్లాల నిర్మాణాల కోసం రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయా చైర్మన్ ఏనుగు రవీందర్ […]
సారథిన్యూస్, ఖమ్మం: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని అఖిలభారత బ్రాహ్మణ సర్వీస్ నెట్వట్ వర్క్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అభిప్రాయ పడింది. ప్రభుత్వ నిర్ణయం బ్రాహ్మణులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. బ్రాహ్మణులకు సంబంధించిన భూ సంబంధ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరువ తీసుకోవాలని కోరారు.