Breaking News

ROADACCIDENT

రహదారి రక్తసిక్తం.. ఐదుగురు దుర్మరణం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్​ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్​ రూరల్​ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్​టేక్​ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న మేకల రాకేశ్​, మేడి చందు, రోహిత్​, సాబిర్​, పవన్​ మృతిచెందారు. మృతులంతా పోచం మైదాన్​కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Read More
మేమున్నాం.. ఆదుకుంటాం

మేమున్నాం.. ఆదుకుంటాం

‘సారథి’’ కథనానికి విశేష స్పందన సాయం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు సారథి న్యూస్, రామడుగు: మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవచ్ఛంలా మారి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్​ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన చెందిన అంజలి భర్త రాజేశేఖర్​కు సాయం చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. ‘‘ఆపదలో ఉన్నం ఆదుకోండి’’ శీర్షికన గత సోమవారం ‘‘సారథిమీడియా’’లో వచ్చిన వార్తా కథనానికి పలువురు ముందుకొచ్చారు. సింగపూర్ లో ఉన్న రామడుగు వాసులు తోట శ్రీనివాస్, […]

Read More

ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి

సారథిన్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తనను నమ్ముకున్న భార్యా, బిడ్డలను రోడ్డున పడేసింది. పనిచేసుకుంటే గానీ పూటగడవని ఆ కుటుంబానికి ఇప్పడు పెద్దకష్టమే వచ్చి పడింది. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని ప్రస్తుతం ఆ కుటుంబం దీనంగా వేడకుంటున్నది. కరీంనగర్​ జిల్లా రామడుగుకు చెందిన రాజశేఖర్​ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు మంచానికే పరిమితమయ్యాడు. అతడికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఆపరేషన్​ చేసేందుకు రూ. […]

Read More