సందిగ్ధంలో భారీ ఎత్తిపోతల పథకం ప్రారంభం నుంచీ ప్రాజెక్టుకు అవాంతరాలే తాజాగా పర్యావరణ అనుమతులు లేవని ట్రిబ్యునల్స్టే నీటి కేటాయింపుల్లేవు.. ప్రాజెక్టుకు అనుమతుల్లేవు నిపుణులు హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వపెద్దలు ఇదీ ‘పాలమూరు’ స్వరూపంప్రారంభ అంచనా వ్యయం: రూ.50వేల కోట్లుపెరిగిన అంచనా వ్యయం: రూ.లక్ష కోట్లుసాగునీటి అంచనా: 10లక్షల ఎకరాలుపంపులు: 5పొడవు: 1000 కి.మీ.ఇప్పటివరకు ఖర్చు: రూ.50వేల కోట్లు -గంగు ప్రకాశ్, ప్రత్యేక ప్రతినిధి, సామాజిక సారథి కరువు ఛాయలు అలుముకున్న పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో కృష్ణాజలాలను పారించి […]
లంకలో అంతా రాక్షసులే ఉంటారని నిరూపించిన ఏపీ సీఎం జగన్ నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి ధ్వజం సారథి ప్రతినిధి, నాగర్కర్నూల్: లంకలో అంతా రాక్షసులే ఉంటారని ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి నిరూపించారని నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పాలిట గాడ్సేగా మారాడని విమర్శించారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిలా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగం ఉసురు తగిలితే జగన్ ఇంటికి పోవడం ఖాయమన్నారు. శనివారం ఆయన […]
సారథి, బిజినేపల్లి: కరోనా బాధితులు, వారి కుటుంబాలపై ఎన్నారైలు తమ ఉదారత చాటుకున్నారు. పాలమూరు ఎన్నారైల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం, తిమ్మాజిపేట ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో కరోనా కిట్లు పంపిణీ చేశారు. వైద్యసిబ్బంది, ఆశావర్కర్లకు మాస్కులు, పీపీఈ కిట్స్, థర్మల్ స్కానర్స్, పల్స్ ఆక్సిమీటర్స్ తో పాటు ఇతర పరికరాలు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారైల ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజికసేవ అందరికీ […]
సారథి న్యూస్, జడ్చర్ల: మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరికి మద్దతుగా జడ్చర్ల, మహబూబ్నగర్లో ‘ఇంటింటికీ ప్రశ్నించే గొంతుక’ అనే కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం చేశారు. పట్టభద్రులు, విద్యార్థులు, మేధావులు, వివిధ రంగాల ఉద్యోగులను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నిరంతరం ప్రజల కోసం ఉద్యమం చేసే పాలమూరు ముద్దుబిడ్డ పోరాట యోధుడు ముకురాల శ్రీహరిని శాసనమండలికి పంపించేందుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని పలువురు ప్రకటించారు. […]
సారథి న్యూస్, మహబూబ్నగర్: ఓ వైపు ఏసీబీ అధికారులు ఆట కట్టిస్తున్నా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కీసర తహసీల్దార్ నాగరాజు, మెదక్ జేసీ ఉదంతం మరువకముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరోపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ రూ.1.65 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ లో క్లోరినేషన్ మెటీరియల్ ను అలీ అహ్మద్ అనే వ్యాపారి సరఫరా […]
కేంద్రానికి లేఖ రాస్తానన్న డీకే అరుణ సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల డిజైన్లను మార్చారని, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ సరైంది కాదని ఇంజినీర్ల బృందం తెలిపిందన్నారు. అయినప్పటికీ […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ వద్ద జరుగుతున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను శుక్రవారం మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, ఎస్.నిరంజన్రెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు, మహబూబ్నగర్ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తదితరుల బృందం పరిశీలించింది. పనులను వేగవంతంగా పూర్తిచేయాలని, నాణ్యతగా ఉండాలని సూచించింది. బృందంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, అంజయ్య […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ సూచించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీ, మర్లు, నలంద ఆటోస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించారు. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాలాలు, రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా పట్టణవాసులు చూసుకోవాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ మోహన్ లాల్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, […]