సారథి న్యూస్, ములుగు: స్వయం సహాయక సంఘాల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందజేస్తున్నరుణాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదర్శసురభి సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్లో జరిగిన రివ్యూ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డెయిరీ వంటి పథకాలను అర్హత కలిగినవారికి మంజూరు చేయాలని సూచించారు. అలాగే ప్రతి మండలంలో క్యాంటీన్ ఏర్పాటుకు స్థలపరిశీలన కోసం తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐదుగురు సభ్యులు ఉన్న […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ గురువారం ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో జిల్లా పోలీస్ సిబ్బంది వెనకడుగు వేయకుండా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందించారని కొనియాడారు. మనదేశంలో తయారైన వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైందని వివరించారు. భారత శాస్త్రవేత్తలు, డాక్టర్లు తయారుచేసిన వ్యాక్సిన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న […]
సారథి న్యూస్, ములుగు: వేసవికాలంలో అడవిలో అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. వేసవిలో ఏర్పడే కార్చిచ్చు ద్వారా అడవులు, వన్యప్రాణులను సంరక్షించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రణాళికలు రూపొందించామని స్పష్టంచేశారు. నాలుగు డివిజన్ల పరిధిలోని 14 అటవీక్షేత్రాల్లో కంపార్ట్మెంట్ల వారీగా ఫైర్ లైన్స్ ఏర్పాటు పనులు చకచకా కొనసాగుతున్నాయి వెల్లడించారు. అగ్నిప్రమాదాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా ప్రతి అటవీక్షేత్రం పరిధిలో ఐదుగురు ప్రత్యేక సభ్యులతో క్విక్ రెస్పాన్స్ టీం […]
సారథి న్యూస్, ములుగు: తరచూ సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కు అరుదైన గుర్తింపు దక్కింది. హైదరాబాద్కు చెందిన ఇంద్రోజిర రమేష్ అనే యువకుడు మంగళవారం ఆమె ఫొటోలతో కూడిన జ్ఞాపికను అందజేశాడు. తస్లీమా రైతు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు సెలవు రోజుల్లోనూ వ్యవసాయ పనులు చేస్తూ.. నిరుపేదలకు చేయూతనందిస్తూ.. అనాథలు, అభాగ్యుల ఆకలి తీరుస్తుంటారు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న […]
సారథి న్యూస్, నూగూరు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ములుగు జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఎన్ఎస్ మండలాధ్యక్షుడు పోలేబోయిన భార్గవ్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం, వాజేడు మండలంలో ఇసుక, గ్రావెల్ దందా అధికారుల అండదండలతో జరుగుతోందన్నారు. ఆదివాసీలు రాజకీయ పార్టీల కుట్రలను పసిగట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని విభజించి ఆదివాసీల ఐక్యతను దెబ్బతీశారని, ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా […]
సారథి న్యూస్, గోవిందరావుపేట: ఈనెల 8న ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపుకోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. సమావేశంలో మండలాధ్యక్షుడు మురహరి భిక్షపతి, మండల అధికార ప్రతినిధి సూరపనేని సాయికుమార్, బోనగాని సారయ్య, బొల్లం శివ, ఎల్లవుల రాజశేఖర్, మండల యూత్ అధ్యక్షుడు బానోత్ సంతోష్, గ్రామాధ్యక్షుడు బానోతు వెంకన్న, బండి రాజశేఖర్, రుద్రబోయిన మల్లేష్ […]
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీసు సముదాయంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్ జి పాటిల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరస్తులకు శిక్షపడేలా కృషిచేయడంలో ముందంజలో ఉందన్నారు. నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో జిల్లాలోని పోలీసు సిబ్బంది శిక్షణ ఇవ్వాలని ఐటీకోర్ సిబ్బందిని ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ […]
సారథి న్యూస్, పస్రా: ములుగు జిల్లా పస్రా గ్రామంలో బుధవారం గండికోట నవీన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.14వేల చెక్కును టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురహరి భిక్షపతి అందజేశారు. ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు చందర్ రాజు, ఎంపీటీసీ వెలిశాల స్వరూప, వార్డు సభ్యులు శ్యాం, పున్నం చందర్, రాజశేఖర్, గజ్జి మల్లికార్జున్, పట్టపు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.