లఢక్ : వాస్తవాధీన రేఖ (ఎల్ఎసీ) వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన లఢక్ లో పర్యటిస్తున్నారు. ఎల్ఎసీ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో నరవణె పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను లేహ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించాను. కొంతమంది అధికారులతో మాట్లాడాను. ఎల్ఎసీ వద్ద ఉద్రిక్త వాతావరణం […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రజౌరి జిల్లా సందర్బన్లో గురువారం అర్ధరాత్రి పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. పాకిస్తాన్ ఆర్మీ రాత్రి 10 :45 గంటలకు ఒక్కసారిగా కాల్పులకు దిగిందని అధికారులు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్ పూంచ్ జిల్లాల్లో కూడా కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని కిర్నీ సెక్టార్లో మోర్టార్లతో దాడి చేశారని, మన ఆర్మీ వారిని సమర్థంగా తిప్పికొట్టిందని […]
శ్రీనగర్: పాకిస్తాన్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన టెర్రరిస్టును సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం మట్టుబెట్టారు. సౌత్ కాశ్మీర్లోని ట్రాల్ వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన టెర్రరిస్టును జాయింట్ ఆపరేషన్లో ఎన్కౌంటర్ చేశామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మరికొంత మంది టెర్రరిస్టులు చొరబడేందుకు యత్నిస్తున్నారనే సమాచారంతో ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పారు. శనివారం నుంచి ఇప్పటివరకు మూడు ఎన్కౌంటర్లు జరిగాయని అన్నారు. గతేడాది పుల్వామాలో జరిగిన ఎటాక్ తరహా ప్లాన్ను మన […]