హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత అనుచరుడిగా పనిచేసి ఆయన ఆత్మగా పేరొందిన సూరీడుపై అతని అల్లుడు సురేంద్రనాథ్రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలోకి ప్రవేశించి క్రికెట్ బ్యాట్తో దాడికి దిగాడు. గతేడాది కూడా సురేంద్రనాథ్ సూరీడుపై దాడికి తెగబడ్డాడు. భార్యను వేధింపులకు గురి చేస్తుండడంతో గతంలో సురేంద్రనాథ్పై గృహహింస కేసు నమోదైంది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని సూరీడుపై సురేంద్రనాథ్ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కేసును ఉపసంహరించుకోకపోవడంతో కక్షతో మామను […]
అక్రమాస్తుల కేసులో ఏసీబీ చిక్కిన మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు చూస్తుంటే ఏసీబీ అధికారులకే దిమ్మతిరిగిపోతుందట. అతడికి ఏకంగా రూ. 100 పైనే ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని విచారిస్తున్నారు. నరసింహారెడ్డికి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు సమాచారం. మరోవైపు నిన్న జరిపిన సోదాల్లో ఏసీపీ ఇంట్లో 15 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు గుర్తించారు. హైదరాబాద్లో రెండు ఇండ్లు, హఫీజ్పేట్లో 3 […]