హెలిక్యాప్టర్ ప్రమాదంలో 13 మంది దుర్మరణం మృతుల్లో బిపిన్రావత్ దంపతులు తమిళనాడులోని వెల్లింగ్టన్లో మిలిటరీ కాలేజీకి వెళ్తుండగా దుర్ఘటన న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయయారు. వారు ప్రయాణిస్తున్న ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో కుప్పకూలిపోయింది. సమయంలో అందులో ఆర్మీ చీఫ్తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సాయుధ దళాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన తన వంతు విరాళం అందజేసి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు […]
ఢిల్లీ: లద్దాఖ్లోని గాల్వన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 76 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు గాయపడ్డారని సంబంధిత అధికారులు ప్రకటించారు. గాయపడినవారిలో 18 మంది లేహ్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, వారు 15 రోజుల్లో డ్యూటీలో చేరే అవకాశం ఉందన్నారు. కాగా మిగిలిన 56 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని, వారంతా రెండు వారాల్లో తిరిగి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. జూన్ 15 అర్ధరాత్రి తర్వాత గాల్వన్ లోయలోని పెట్రోల్ […]
జైపూర్: భారత్కు చెందిన రహస్య సమాచారానిన దాయాది దేశమైన పాకిస్థాన్కు చేరవేస్తున్న ఇద్దరు సైనికాధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ డిఫెన్స్ ఆఫీసర్లు వికాస్ కుమార్ (29), చిమల్ లాల్ (22) శ్రీనగర్ జిల్లాలో ఉన్న ఆర్మీ మందుగుండు సామగ్రి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు అధికారులు చెప్పారు. వీరిద్దరూ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చేరవేస్తున్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరిపై ఆఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్ 1923 కింద కేసు నమోదు చేసినట్టు ఇంటెలిజెన్స్ అడిషినల్ […]