సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం నవోదయ విద్యాలయంలో 2020–21 అకాడమిక్ ఆరవ తరగతిలో చేరేందుకు విద్యార్థుల ప్రవేశపరీక్షకు శుక్రవారం నోటిఫికేషన్విడుదలైందని ప్రిన్సిపల్ వీరరాఘవయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 80 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఐదవ తరగతి చదివిన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. సీబీఎస్ఈ బోధన ఉంటుంది. […]
జంషడ్పూర్: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఓ విద్యార్థిని నిరూపించింది. జార్ఘండ్ రాష్ట్రం జంషడ్పర్కు చెందిన నందితా హరిపాల్ సీబీఎస్ఈ 12 వతరగతిలో ని ఆర్ట్స్ విభాగంలో 83.8 శాతం మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. నందిత తండ్రి టైలర్గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి కుటుంబం పేదరికంలో మగ్గుతున్నది. కూతురు నందిత జంషడ్పూర్ ఉమెన్స్ కళాశాలలో విద్యనభ్యసించింది. ‘నేను టాపర్గా నిలుస్తానని కలలో కూడా ఊహించలేదు. ఫలితాలు చూసి నాతోపాటు కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారు. నేను […]
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదోతరగతి రిజల్ట్స్ విడుదలయ్యాయి. బుధవారం ఉదయం ఫలితాలను వెబ్సైట్లో ఉంచారు. ఉమాంగ్ యాప్, టోల్ఫ్రీ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఈ ఏడాది 91.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణతశాతం పెరిగింది. దాదాపు 41,804 మంది విద్యార్థులు 95 శాతం మార్కులు స్కోర్ చేశారు. సీబీఎస్ఈ ఇప్పటికే పన్నెండోతరగతి ఫలితాలు విడుదల చేసింది. కరోనా కారణంగా టెన్త్, పన్నెండోతరగతి పరీక్షలను […]
ఢిల్లీ: సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 12 వతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు మొత్తం 11,92,961 మంది హాజరుకాగా 88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోబ్రియాల్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. పరీక్షాఫలితాలను cbseresults.nic.inలో చూడవచ్చు. గత ఏడాది 83.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 5.38శాతం అధిక ఉత్తీర్ణత నమోదైంది. త్రివేండ్రంలో అత్యధికంగా 97.67 శాతం మంది, […]
న్యూఢిల్లీ: కరోనా ప్రబలుతున్న కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఎగ్జామ్స్ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. గురువారం విచారణ జరిగిన సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన తుషార్ మెహతా ఈ విషయాన్ని కోర్టుకు చెప్పారు. జులై 1 నుంచి 15 వరకు జరగాల్సిన సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వాటితో పాటు ఐసీఎస్ఈ పరీక్షలను కూడా క్యాన్సిల్ చేశామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ, […]