Breaking News

CARONA

కరోనాతో యువకుడి మృతి

కరోనాతో యువకుడి మృతి

సారథి, పెద్దశంకరంపేట: కరోనాతో యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని జంబికుంట గ్రామంలో చోటుచేసుకుంది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న యువకుడు మంగళవారం ఉదయం స్థానిక  ప్రభుత్వాసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కరోనా పరీక్ష చేయించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అతని మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాలుగు పాజిటివ్ కేసులు ఒకేరోజు 25 మందికి పరీక్షలు చేయగా అందులో నాలుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి డాక్టర్ […]

Read More
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట్ లో ప్రతి లచ్చయ్య ఇటీవల కరోనతో మృతిచెందాడు. కుటుంబాన్ని ఆదుకునేందుకు యువకులు సేకరించిన రూ.40వేలను మంగళవారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్యప్రసన్న, ఎంపీటీసీ ఎడవెళ్లి నరేందర్, ఉపసర్పంచ్ ఎడవెళ్లి మధుసూదన్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై విజయ్, సిద్దార్థ, పురాణం రమేష్, టేకు రాజేశం పాల్గొన్నారు.

Read More
కరోనా రోగులకు ఏపీఆర్ ట్రస్ట్ భరోసా

కరోనా రోగులకు ఏపీఆర్ ట్రస్ట్ భరోసా

సారథి, రామయంపేట: కరోనా బాధితులకు అందె ప్రతాప్ రెడ్డి (ఏపీఆర్) ట్రస్ట్ అండగా ఉంటుందని కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు అన్నారు. అందె ప్రతాప్ రెడ్డి సహృదయంతో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపు మేరకు శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. వారిలో మనోధైర్యం కల్పించడం కోసం ట్రస్ట్ ముందుకొచ్చిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజాంపేట పీఏసీఎస్ డైరెక్టర్ ఎండీ అబ్దుల్, […]

Read More
అభాగ్యులకు అన్నదానం

అభాగ్యులకు అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయం ముందు రోడ్డు మీద తిరిగే అభాగ్యుల కోసం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు శనివారం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది కలిసి రాజరాజేశ్వర దేవస్థానం వారు అన్నదానం చేశారు. వారికి మధ్యాహ్నం, రాత్రి రెండుపూటలా భోజనం పెట్టనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతిర్తపు మాధవి, ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ పర్యవేక్షకులు శ్రీరాములు, […]

Read More
భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’

భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’

సారథి, హెల్త్ డెస్క్: అసలే కరోనా కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి దాపురిస్తుందో తెలియడం లేదు. ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో అంతుచిక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకున్న ప్రజలను మరో కొత్త రోగం వణికిస్తోంది. ఇది అంటువ్యాధి కాదు.. ఎవరికి పడితే వారికి రాదు. ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం. కరోనా వ్యాధితో కోలుకున్న పేషెంట్లకు ఈ రోగం వస్తోంది. తగిన సమయంలో గుర్తించకుంటే ప్రాణాలు తీస్తోంది. అదే […]

Read More
కొంత మందికే కరోనా టెస్టులు

కొంత మందికే కరోనా టెస్టులు

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతు వేదికలో నిర్వహిస్తున్న కరోనా టెస్టింగ్ కేంద్రాలకు జనం బారులుదీరుతున్నారు. రోజు 100 మంది నుంచి 150 మంది టెస్టుల కోసం వస్తుండగా, కిట్లు మాత్రం 50 ఉంటున్నాయి. దీనితో పరీక్షల కోసం రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తోంది. రోజుకు 50 టెస్టులు చేయగా అందులో 20 నుంచి 25 వరకు పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గత 25 రోజుల్లో చొప్పదండిలో 30 నుంచి 40 మంది […]

Read More
కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

సారథి, వనపర్తి: కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. గురువారం పెబ్బేరులో కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, జిల్లా ఆస్పత్రి, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. డాక్టర్ల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ అభినందనలు తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఐసొలేషన్ లో ఉంచితే ఇబ్బంది ఉండదని, ఇంటింటి సర్వేలో జ్వరపీడితులను గుర్తించి […]

Read More
సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సారథి, సిద్దిపేట: కొవిడ్ బాధితుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న సీటీ స్కానింగ్ రేటు రూ.5,500 బదులుగా రూ.రెండువేల మాత్రమే తీసుకునేందుకు స్కానింగ్ సెంటర్లు అంగీకారం తెలిపాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కొవిడ్ చికిత్స పొందే పేద, మధ్యతరగతి బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ ఆస్పత్రులుగా మారిన అన్ని […]

Read More