సారథి న్యూస్, హైదరాబాద్: 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 21కోట్ల మంది కరోనాబారిన పడతారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2020 ఆగస్టు 15కు కరోనా వ్యాక్సిన్ తెస్తామంటోంది భారత ప్రభుత్వం. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపించేందుకు అవకాశాలను కొట్టిపారేయలేమంటుంది ప్రపంచ ఆరోగ్యసంస్థ. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ సర్కారు రోజురోజుకూ వైద్యపరీక్షలు పెంచుతోంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల మందిని పరీక్షించింది. మరి.. తెలంగాణలో 28వేల మందికి వైరస్ సోకింది. 16వేల మంది డిశ్చార్జ్అయ్యారు. 12వేల మంది ఆస్పత్రుల్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గడం లేదు. తాజాగా గురువారం 1,410 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు 30,945కు చేరాయి. తాజాగా ఏడుగురు మృతి, ఇప్పటి వరకు 331 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 918 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 125 కేసులు, మేడ్చల్ జిల్లాలో 67, సంగారెడ్డి 79, వరంగల్ అర్బన్జిల్లాలో 34 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,40,755 కరోనా పరీక్షలు నిర్వహించారు.
తిరువనంతపురం: ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తుంటే.. కొందరేమో నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కేరళలోని ఓ రిసార్ట్లో జరిగిన విందులో సుమారు 300 మంది పాల్గొన్నట్టు సమాచారం. అనంతరం ఆ వీడియోలను సోషల్మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేరళలోని హిల్లీ జిల్లా ఉదుంబంచోలలో ఈ ఘటన చోటుచేసుకున్నది. రిసార్టు మేనేజర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 29న ఈ […]
చెన్నై: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మోసగాళ్ల రెచ్చిపోతున్నారు. కరోనాకు మందు కనిపెట్టామంటూ ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ ప్రకటించి.. ఆ తరువాత తూచ్ అంటూ నాలుక కరుచుకున్నది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ స్వీట్ షాప్ ఇదే తరహా మోసానికి పాల్పడింది. తమ దుకాణంలో తయారుచేసే మైసూర్ పిక్ తిని కరోనాను నయం చేసుకోవచ్చని ప్రచారం మొదలుపెట్టింది. అంతేకాక రూ.800 కిలో చొప్పున ఆ స్వీట్ను అమాయకులకు అంటగట్టింది. ఈ మైసూర్పాక్లో 19 రకాల […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైద్యానికి అయ్యే ఖర్చులను నిర్ధారిస్తూ ఉత్తుర్వులు జారీచేసింది. ఈ మేరకు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. క్రిటికల్ గా లేని పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ.3,250 గా నిర్ధారించారు. ఎన్ఐవీతో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 29,536 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,933 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 992 మంది డిశ్చార్జ్కాగా, ఇప్పటివరకు 17,279 మంది కోలుకున్నారు. తాజాగా 11 మందితో కలిపి మొత్తంగా 324 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఇప్పటివరకు 1,34,801 టెస్టులు చేశారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో […]
సారథిన్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. కొత్తగా జిల్లాలో మరో ఏడు కరోనా కేసులు నమోదైనట్టు సమాచారం. సూర్యాపేట జిల్లాకేంద్రంలో జమ్మిగడ్డ, అలంకార్ రోడ్, గడ్డిపల్లి, దోసపహాడ్, తిరుమలగిరి, (మాలిపురం) ప్రాంతాలతోపాటు కోదాడ, హుజూర్ నగర్ లలోనూ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.
జెనీవా: చైనాలోని వూహాన్లో పుట్టి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తున్న కంటికి కనిపించని కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చని ప్రంపచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చెప్పింది. ఈ మేరకు సైంటిస్టులు చెప్పిన ఆ విషయాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించింది. దానిపై పక్కా ఆధారాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని డబ్ల్యూహచ్వో టెక్నికల్ లీడ్ బెనిడెట్టా అలెగ్రాంజీ అన్నారు. ‘జనం ఎక్కువగా ఉన్న దగ్గర, చీకటి ప్రదేశాల్లో గాలి నుంచి వైరస్ వ్యాపించవచ్చన్న వాదనను కొట్టిపారేయలేం. దీనికి సంబంధించి ఆధారాలు […]