న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. ఇప్పటివరకు 22,15,074 కేసులు నమోదయ్యాయి. కేవలం గత 24 గంటల్లోనే 62,064 మందికి కొత్తగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 6,34,949 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 44,386 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,077 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు 2.45 కోట్ల పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం కొత్తగా 1,982 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 12 మంది మృతి చెందారు. అయితే ఇప్పటివరకు మహమ్మారి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 627కు చేరింది. అయితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 79,495కు చేరింది. కొత్తగా 1,669 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 55,999గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 22,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 463 నిర్ధారణ […]
సారథిన్యూస్, విజయవాడ: విజయవాడలోని ఓ కోవిడ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు 11 మంది కరోనా రోగులు మృతిచెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ హోటల్ స్వర్ణప్యాలెస్ను కోవిడ్ కేర్ సెంటర్గా వినియోగిస్తున్నారు. ఈ హోటల్లో దాదాపు 40మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో కరోనా బాధితులు కేకలు పెట్టారు. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. […]
సారథిన్యూస్, అన్నవరం: ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నది. దాదాపు అన్ని జిల్లాలకు వ్యాధి విస్తరించింది. కేసులతోపాటు మరణాల సంఖ్య అధికంగానే ఉన్నది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో 39 మంది సిబ్బందికి కరోనా సోకింది. శుక్రవారం 10 మంది అర్చకులకు కరోనా సోకడంతో.. శనివారం ఆలయంలో పనిచేస్తున్న 300 మంది సిబ్బందికి పరీక్షలు చేశారు. దీంతో మరో 29 కొత్తకేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్లో ఉండి చికిత్స […]
సారథిన్యూస్, హైదరాబాద్ : కరోనా బారిన పడి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కోలుకున్నారు. కొవిడ్ దాటికి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో తన కుటుంబ సభ్యులకు, ఇంట్లో పని వారికీ కూడా కరోనా టెస్టులు చేయించారు. సుధీర్రెడ్డి భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్లు అధికారులు […]
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. కొంతకాలం క్రితం అమితాబ్ కుటుంబంలోని జయాబచ్చన్ తప్ప మిగతా కుటుంబసభ్యులంతా కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అభిమాన నటుడు, ఆయన కుటుంబం కరోనా నుంచి కోలుకోవాలని అభిమానులు పూజలు చేశారు. అయితే అమితాబ్ బచ్చన్ కుటుంబలో కరోనా సోకిన ఐశ్వర్యా రాయ్, ఆమె కూతురు ఆరాధ్య తొందరగానే డిశ్చార్జి అయ్యారు. ఇటీవల అమితాబ్ కూడా కోలుకొని ఇంటికి వచ్చేశారు. కానీ అభిషేక్ బచ్చన్కు […]
వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోరోనా బారినపడ్డారు. జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడి విషయం తెలిసిందే. వారంతా కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సపొంది కోలుకున్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. కరోనా భారిన పడ్డ రాజకీయనాయకులు, సెలబ్రిటీల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మల్లారెడ్డికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మల్లారెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు సన్నిహితంగా ఉన్న వారికి కూడా అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. గతంలో హోంమంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ […]