సారథి న్యూస్, కర్నూలు: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారీ విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజలు ఇళ్ల వద్దనే చిన్న చిన్న మట్టి విగ్రహాలను ఏర్పాటుచేసుకుని పూజిస్తున్నారు. నగరంలోని బుధవారపేట 15వ వార్డులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేదార్నాథ్ఇంటివద్దే మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. రెండొందల బిందెల నీళ్లు తమ భక్తిని నాటుకున్నారు. మట్టి గణపయ్య విశిష్టతను తెలియజేసేలా ఈ వినాయకుడిని నిలబెట్టినట్లు తెలిపారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారని తెలిపారు.
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలోని తన నివాసంలో శనివారం వినాయక చవితి వేడుకలను జరుపుకున్నారు. తన సతీమణి ఉషా నాయుడుతో కలిసి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక వ్రతకల్పం చదివారు.
తెలుగులో విజయం సాధించిన ‘వినాయకుడు’ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. కొంతకాలంగా తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు బాలీవుడ్ రీమేక్ కు రెడీ అయ్యాయి. చాలా కాలం క్రితం తెలుగులో హిట్ అయిన దూకుడు, అరుంధతి వంటి సినిమాలను ప్రస్తుతం రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. కాగా దాదాపు 12 ఏళ్ల క్రితం కృష్ణుడు హీరోగా నటించిన ‘వినాయకుడు’ సినిమాను హిందీ […]