సారథి న్యూస్, శ్రీకాకుళం: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మికవర్గంపై జరుపుతున్న తీవ్రమైన దాడికి నిరసనగా 11 అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పాలకొండలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కరోనాను అవకాశంగా తీసుకుని కార్మికవర్గంపై ముప్పేట దాడి కొనసాగిస్తోందన్నారు. కేంద్రప్రభుత్వ విధానాల కారణంగా కార్మికులు నేడు పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కార్మికులకు నెలకు రూ.7,500తో పాటు 10 […]
ప్రధాని నెమలితో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు ప్రధానమంత్రి మోడీపై రాహుల్ ఫైర్ న్యూఢిల్లీ : ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. మోడీ నెమళ్లతో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారనీ, ప్రజలంతా ఎవరి జీవితాలను వారే కాపాడుకోవాలని సూచించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘భారత్లో కరోనా కేసులు ఈ వారంలో 50 లక్షలు చేరుకోనున్నాయి. ఒక వ్యక్తి ఆహాన్ని సంతృప్తి పరుచుకునేందుకు […]
న్యూఢిల్లీ: యువ ఐఏఎస్ ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం(పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ల జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్దియాల్ను నియమిస్తూ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ కేడర్ నుంచి2010 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటుచేసిన ‘పీఎం కేర్స్’ నిధికి మోడీ రూ. 2.25 లక్షల విరాళమిచ్చారు. ఈ నిధికి వచ్చిన విరాళాలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. పీఎం కేర్స్ లో పారదర్శకత లోపించిందని విపక్షాలు మోడీ సర్కారుపై విమర్శలు చేసినా.. ఆ వివరాలను బహిర్గతం చేయాలని ఆర్టీఐ కింద దరఖాస్తుదారులు కోరినా దానికి బీజేపీ సర్కారు స్పందించలేదు. […]
న్యూఢిల్లీ : అయోధ్య రామమందిర నిర్మాణ భూమిపూజకు ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయోధ్య రామమందిర భూమిపూజకు హాజరు కావల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ మోదీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ప్రధానితో పాటు మరో 250 మంది అతిథులు కూడా హాజరుకాన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందు పరిషత్ సీనియర్ ప్రతినిధులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్: ఇండియా, చైనా మధ్య బోర్డర్లో తలెత్తిన గొడవను క్లియర్ చేసేందుకు తాను సిద్ధమని, దాని కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోడీ ఈ విషయంపై మాట్లాడే మూడ్లో లేరని ఆయన చెప్పారు. గురువారం ఆయన వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. లద్దఖ్లోని ప్యాంగాంగ్ లేక్ ఏరియాలో చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. […]