Breaking News

నియంత్రిత సాగు

నెలరోజుల్లో నీళ్లు తెస్తా

హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ సారథి న్యూస్​, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులపై కోర్టుల్లో వేసిన కేసులను కొట్టివేస్తే నెలరోజుల్లో నీళ్లు తెప్పిస్తానని ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ సవాల్ విసిరారు. ఆదివారం పట్టణంలోని తిరుమల గార్డెన్ లో వ్యవసాయ విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే ప్రభుత్వం నిర్దేశించిన పంటలను మాత్రమే పండించాలన్నారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులపై లేనిపోని రాద్ధాంతం చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ […]

Read More

జూన్​ 10 కల్లా రైతుబంధు పైసలు

ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు సారథి న్యూస్, మెదక్: వానాకాలం పంట సీజన్​కు సంబంధించి జూన్​ 10వ తేదీ నాటికి రైతుబంధు పైసలను రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. ఆదివారం మెదక్​ జిల్లా కేంద్రంలో రైతులకు నియంత్రిత సాగుపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాలకు సంబంధించి రైతులకు రైతుబంధు కోసం రూ.ఏడువేల కోట్లు అవసరం ఉండగా, ఇప్పటికే రూ.3,500 కోట్లు వ్యవసాయశాఖకు ఇచ్చినట్టు వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు అవసరం […]

Read More

లాభం వచ్చే పంటలు వేయండి

మంత్రి సబితాఇంద్రారెడ్డి సారథి న్యూస్​, మహేశ్వరం: రైతులకు నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పోతర్ల బాలయ్య ఫంక్షన్ హాల్ లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతులు లాభాసాటి పంటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్​ పర్సన్​ తీగల అనిత, మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ జ్యోతి, కందుకూరు మండల ఎంపీపీ జ్యోతి పాల్గొన్నారు.

Read More