ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సామాజిక సారథి, ఐనవోలు: ప్రైవేట్ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడమే సీఎం సహాయనిధి లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలంలోని ఫున్నెలు, వనమాల కనిపర్తి గ్రామాల్లో 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.11.32లక్షల చెక్కులను శనివారం అందజేశారు. అత్యవసర సమయంలో ప్రైవేట్ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అభాగ్యులు, నిరుపేదలకు అండగా నిలుస్తుందని, కరోనా కాలంలో ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ […]