Breaking News

కల్యాణలక్ష్మి

తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శం

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కొనసాగుతున్నదని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మంగళవారం మెదక్​ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ నేతలు పాల్గొన్నారు.

Read More

కల్యాణ లక్ష్మి పేదలకు వరం

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దశంకరంపేట మండలం బుజరంపల్లి, గోపని వెంకటాపూర్​, టెంకటి గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ పేదప్రజల పక్షానే ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ మహిళా వీఆర్వో

సారథిన్యూస్​, పాల్వంచ: ఓ మహిళా అధికారి లంచం తీసుకుంటూ రెడ్​హ్యండెడ్​గా ఏసీబీకి చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఓ బాధితురాలు .. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆ దరఖాస్తును అప్రూవల్​ చేసేందుకు వీఆర్వో పద్మ లంచం డిమాండ్​ చేసింది. బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా .. రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం తహసీల్దార్​ కార్యాలయంలో వీఆర్వో పద్మ.. లంచం తీసుకుంటుండగా అధికారులు గా పట్టుకున్నారు.

Read More