న్యూఢిల్లీ: చైనా మరో షాక్ తగిలింది. ఇప్పటికే యాప్స్ను బ్యాన్ చేసిన ఇండియా కలర్ టీవీల దిగుమతులపై ఆంక్షలు విధించింది. టీవీలు దిగుమతి చేసుకునే వారు కచ్చితంగా ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలని, లైసెన్స్ ఉన్న వాళ్లు మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలని సూచించింది. దాన్ని రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి తీసుకొచ్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) స్టేట్మెంట్ ఇచ్చింది. ‘టీవీ ఇంపోర్ట్స్ ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి వస్తుంది. దిగుమతి చేసుకోవాలంటే లైసెన్స్ ఉండాల్సిందే. చైనా టీవీలకు చెక్ […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్లో నెలకొన్న ఉద్రిక్తతలపై యూకే స్పందించడంతో డ్రాగన్ వారిపై సీరియస్ అయింది. ఈ విషయంలో మూడో పార్టీ జోక్యం అవసరం లేదని చెప్పింది. సరిహద్దుల వెంట నెలకొన్న పరిస్థితులను చర్చలతో పరిష్కరించుకుంటామని చెప్పింది. పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలనే విషయం తమకు బాగా తెలుసని, అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పింది. దాంతో పాటు హాంకాంగ్ విషయంలో కూడా ఎవరి జోక్యం అవసరం లేదని సీరియస్ అయింది. పాంగాంగ్, గోగ్రా పోస్ట్ నుంచి […]
న్యూఢిల్లీ: చైనాను దెబ్బతీసేందుకు మన సైన్యం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ మేరకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కొత్త భాషను నేర్చుకుంటుంది. ఐటీబీపీలోని 90వేల మంది చైనాలో ఎక్కువగా మాట్లాడే మాండరిన్ భాష నేర్చుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేక కోర్సును డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. లద్దాఖ్లో ఇటీవల జరిగిన గొడవల నేపథ్యంలో ఐటీబీపీ తమ జవాన్ల కోసం మాండరిన్ కోర్సును నేర్పిస్తున్నారు. మన సైనికులు మాండరిన్ భాషను నేర్చుకుంటే చైనా సైనికులతో నేరుగా మాట్లాడేందుకు వీలుంటుందని, […]
ఢిల్లీ: వివిధ అవసరాల కోసం దిగుమతి చేసుకునే 350 రకాల వస్తువులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో ఎలక్ట్రానిక్, టెక్స్టైల్స్, బొమ్మలు, ఫర్నిచర్ వంటివి ఉన్నాయి. దేశీయ సంస్థలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయా వస్తువుల దిగుమతి అవసరాలను పరిశీలించేందుకు ఓ మానిటరింగ్ వ్యవస్థని ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఆ వ్యవస్థ అత్యవసరమైన వాటిని మాత్రమే పరిశీలించి లైసెన్స్ ఇస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్కు ఊతమిచ్చేలా ఈ […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్ విషయంలో చర్చలు జరిగిన తర్వాత చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోతోందని అధికార వర్గాలు సమాచారం. స్పెషల్ రిప్రజంటేటివ్ చర్చల తర్వాత చాలా చోట్ల దాదాపు 2 కి.మీ. దూరం వెనక్కి వెళ్లినట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. పెట్రోల్ పాయింట్ 17ఏ వద్ద నుంచి కూడా గురువారం లేదా శుక్రవారం సైన్యం వెళ్లిపోతుందని అన్నారు. ఇప్పటికే పాంగ్వాంగ్ లేక్, ఫింగర్ 4 ఏరియాలో ఇప్పటికే టెంట్లు తీసేసి, […]
జెనీవా: చైనాలోని వూహాన్లో పుట్టి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తున్న కంటికి కనిపించని కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చని ప్రంపచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చెప్పింది. ఈ మేరకు సైంటిస్టులు చెప్పిన ఆ విషయాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించింది. దానిపై పక్కా ఆధారాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని డబ్ల్యూహచ్వో టెక్నికల్ లీడ్ బెనిడెట్టా అలెగ్రాంజీ అన్నారు. ‘జనం ఎక్కువగా ఉన్న దగ్గర, చీకటి ప్రదేశాల్లో గాలి నుంచి వైరస్ వ్యాపించవచ్చన్న వాదనను కొట్టిపారేయలేం. దీనికి సంబంధించి ఆధారాలు […]
వాషింగ్టన్: వివిధ దేశాల్లో చైనాపై రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. చైనాకు చెందిన యాప్స్ను మన దేశం ఇప్పటికే బ్యాన్ చేయగా.. అమెరికా కూడా ఆ దిశగా ఆలోచిస్తోందని ఆ దేశ విదేశాంగశాఖ సెక్రటరీ స్టేట్ మైక్పాంపియో అన్నారు. ‘అధ్యక్షుడి కంటే ముందే నేను ఈ విషయాన్ని చెప్పాలను కోవడం లేదు. కానీ ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం’ అని మైక్పాంపియో అన్నారు. ముఖ్యంగా టిక్టాక్ వంటి యాప్లు సేకరించే సమాచారంపై పలువురు అనుమానాలు వ్యక్తం […]
న్యూఢిల్లీ: గడిచిన రెండు నెలల్లో 200 శాతం సైబర్ ఎటాక్స్ పెరిగాయని పీఎంవో అధికారి గుల్షన్ రాయ్ పేర్కొన్నారు. అయితే చైనా –ఇండియా మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అవి పెరిగాయనే దానికి సాక్ష్యాలు లేవని ఆయన అన్నారు. ‘పిషింగ్, రాన్సమ్వేర్ ఎక్కువయ్యాయి. జనవరి, ఫిబ్రవరి చివన నుంచి ఈ కేసులు ఎక్కువయ్యాయి. టెన్షన్ పరిస్థితులు దృష్ట్యా పెరగలేదు’ అని ఆయన చెప్పారు. ఆఫీసులు అన్నీ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, పర్సనల్ కంప్యూటర్స్లో కూడా అప్లికేషన్లు డౌన్లోడ్ […]