Breaking News

కరీంనగర్

‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో జగిత్యాల ప్రధాన రహదారిపై హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీఆర్డీవో లంకల శ్రీలతరెడ్డి తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

Read More
సమస్యలకు సత్వర పరిష్కారం

సమస్యలకు సత్వర పరిష్కారం

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సారథి, చొప్పదండి: మండల పరిషత్ సమావేశాల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేవనెత్తిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం చొప్పదండి మండల జనరల్ బాడీ మీటింగ్ ఎంపీపీ చిలుక రవీందర్ అధ్యక్షతన జరిగింది. అర్హులైన అందరికీ రేషన్ కార్డు లు ఇవ్వాలని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సింగిరెడ్డి క్రిష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇంకుడు గుంతల బిల్లులు చెల్లించాలని పలువురు సభ్యులు […]

Read More
పేదలకు సరుకులు పంపిణీ

పేదలకు సరుకులు పంపిణీ

సారథి, రామడుగు: కరోనా మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేసింది. ఈ సమయంలో బడుగు జీవులకు ఆపన్నహస్తం అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు ఎందరో మహానుభావులు. ఆదరణ సేవాసమితి, సర్వ్ టూ సొసైటీ సంయుక్తంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. వారి చదువు పూర్తయినందున ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొక్కెరకుంట గ్రామంలో […]

Read More
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో రూ.ఐదులక్షల సీడీపీ నిధులతో నిర్మించనున్న గొల్ల యాదవ కురుమ సంఘం భవనం, రూ.43 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీరప్ప ఆలయం పనులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో దండిగా నిధులు ఖర్చుచేస్తున్నామని చెప్పారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి లోటు రానివ్వలేదన్నారు. కులసంఘాల భవనాలు, ఆలయాలు, మురికి కాల్వలు, సీసీరోడ్లు, హైమాస్ట్ లైట్లు.. […]

Read More
వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండిగోపాల్ రావుపేట ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలోని వ్యాక్సినేషన్ సెంటర్ ను కలెక్టర్ శశాంక బుధవారం సందర్శించి వ్యాక్సినేషన్ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరూ వాక్సిన్ వేసుకునేలా మోటివేషన్ చేయాలని సూచించారు. కరోనా పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలు రావడం లేదని, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని సర్పంచ్, ఉపసర్పంచ్, వైస్ ఎంపీపీ కలెక్టర్ శశాంకను కోరారు. ఆయన వెంట ఎంపీడీవో మల్హోత్రా, తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీవో సతీష్ రావు, రామడుగు […]

Read More
వాహనాల తనిఖీ

వాహనాల తనిఖీ

సారథి, చొప్పదండి: లాక్ డౌన్ లో భాగంగా మంగళవారం చొప్పదండి సీఐ కె.నాగేశ్వర్ రావు, ఎస్సై బి.వంశీకృష్ణ వాహనాలను తనిఖీచేశారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని మూడు వెహికిల్స్ ను సీజ్ చేశారు. 15 వాహనాలను ఫైన్ వేశారు. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటికి రావొద్దని సూచించారు. ఎలాంటి పనులు ఉన్నప్పటికీ ఉదయం 10 గంటలలోపే పూర్తిచేసుకోవాలని కోరారు.

Read More
వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్యే

వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్యే

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రంలో మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరోనా రెండో డోసు వాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. భౌతికదూరం పాటించాలన్నారు. రెండు మాస్కులు ధరించాలన్నారు. వాక్సినేషన్ తొందరగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిందని ఎమ్మెల్యే తెలిపారు.

Read More
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

సారథి, రామడుగు: రైతులకు అసౌకర్యం కలిగించకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ నిర్వాహకులకు చూచించారు. మండలంలోని వెదిర ఫ్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ కోమల్ రెడ్డి తో కలిసి సందర్శించారు. ఇప్పటివరకు ఎంత మొత్తంలో కొనుగోలు చేశారనే విషయాలను నిర్వాహకుల నుంచి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జేసీ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట మండల […]

Read More