Breaking News

నల్లగొండ

తెలంగాణలో ఊహించని అభివృద్ధి

తెలంగాణలో ఊహించని అభివృద్ధి

నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య తీర్చిన ఘనత కేసీఆర్ దే  విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సర కాలంలోనే ప్రజలు ఊహించని అభివృద్ధి చేసి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్ కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ […]

Read More
డెంగీని తరిమేద్దాం

డెంగీని తరిమేద్దాం

సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: డెంగీ నివారణను మనం మన ఇంటి నుంచే మొదలుపెడదామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దోమల నివారణతోనే వ్యాధిని నివారించడం సాధ్యమవుతుందని, ఇంటి ఆవరణలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. మే16న జాతీయ డెంగీ నివారణ దినాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ క్యాంపు ఆఫీసు ఆవరణలో బ్యానర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెంగీపై జిల్లా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని […]

Read More
ఆ సర్పంచ్ గొప్ప మనస్సు.. ఎందుకో తెలుసా?

ఆ సర్పంచ్ గొప్ప మనస్సు.. ఎందుకో తెలుసా?

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు కరోనాతో మృతిచెందాడు.  యువకుడి మృతితో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో మొదటి కరోనా మరణం జరగడంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శవాన్ని పూడ్చి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సర్పంచ్ కర్నె లక్ష్మీనారాయణ పీపీఈ కిట్టు ధరించి అంత్యక్రియలు చేయడానికి ముందుకొచ్చారు. అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తో పాటు మరో నలుగురు యువకులు సర్పంచ్ […]

Read More
నాగార్జునసాగర్‌ లో కారుదే జోరు

నాగార్జునసాగర్‌ లో కారుదే జోరు

టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ విజయం కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి ఓటమి డిపాజిట్ దక్కించుకోని బీజేపీసారథి, నాగార్జునసాగర్​: నాగార్జున‌సాగర్ ఉపఎన్నికలో కారు జోరు కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ 18వేల పైచిలుకు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. దీంతో జానారెడ్డి వరుసగా మూడోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ సైతం దక్కలేదు. ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య మరణంతో సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమారుడు భగత్ కుమార్ టీఆర్ఎస్ తరపున పోటీచేసి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ […]

Read More
మాలల చైతన్యం చాటుతాం

మాలల చైతన్యం చాటుతాం

సారథి, నాగార్జునసాగర్: మాలలు అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. మాలలు ఐక్యంగా ఉండి చైతన్యం చాటాలని పిలుపునిచ్చారు. సోమవారం నాగార్జునసాగర్​లోని హిల్ కాలనీలో నిర్వహించిన మాల మహానాడు ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. ప్రైవేట్​రంగంలోనూ రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్​చేశారు. ఎస్సీ,ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకుని త్వరలో రాజకీయ ఐక్యవేదికను ఏర్పాటుచేస్తామన్నారు. సాగర్ లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే […]

Read More
ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్​

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్​

సారథి న్యూస్, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్​రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.

Read More
సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని డిండిలో ముంచాలే

సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని డిండిలో ముంచాలే

రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం కార్పొరేట్​ శక్తులకు చేతుల్లోకి వ్యవసాయం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సారథి న్యూస్​, దేవరకొండ: దళిత, గిరిజనులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని డిండి ప్రాజెక్టులో ఎత్తేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రాంతానికి డిండి ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తానని చెప్పిన సీఎం కేసీఆర్​ ఐదేళ్లలో ఒక్క ఎకరాకైనా పారించారా? అని అని ప్రశ్నించారు. రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం […]

Read More
నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్

నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్

సారథి న్యూస్, నకిరేకల్: నకిరేకల్ ​మండలం పాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కె.చంద్రశేఖర్​రావు పాల్గొని భౌతికకాయానికి నివాళులు అర్పించారు. నర్సింహ్మయ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మహమూద్ అలీ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ రాష్ట్ర రైతు […]

Read More