సారథి, హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాతృమూర్తి కొండా జయలతాదేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొండా జయలతాదేవి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి, ఎస్.కుమార్, సంగప్ప తదితరులు ఉన్నారు.
సారథి, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కేంద్రంలో మొక్కలు నాటి పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికి స్ఫూర్తివంతంగా నిలిచిందన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా నడుస్తోందన్నారు. నాటిన మొక్కలను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే […]
డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సారథి, రామాయంపేట: మొక్కలను పెంచి హరిత తెలంగాణను నిర్మించి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కొనియాడారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అయినప్పటికీ ఈ 10రోజులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలో పల్లెప్రగతిలో కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా ఆమె […]
సారథి, హైదరాబాద్: ఎన్నో రోజుల ఉత్కంఠకు తెరపడింది. అందరి అంచనాలు నిజమే అయ్యాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్సెక్రటరీ కేసీ వేణుగోపాల్ఉత్తర్వులు జారీచేశారు. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పదిమందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించారు. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లుగా జగ్గారెడ్డి, మహేష్గౌడ్, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్కుమార్, వైస్ ప్రెసిడెంట్లుగా చంద్రశేఖర్, దామోదర్రెడ్డి, కొల్లు రవి, వేం నరేందర్రెడ్డి, రమేష్ ముదిరాజ్, కుమార్రావు, […]
సారథి, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఏపీ, తెలంగాణ బోర్డర్ పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రాకపోకలను ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ బుధవారం పరిశీలించారు. అలంపూర్ ప్రాంతానికి కర్నూలు పట్టణం చేరువలో ఉండటంతో ప్రతి చిన్న పనికి అక్కడికి వెళ్లి రావాల్సి వస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ విషయమై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి జోగుళాంబ […]
సారథి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల వ్యవహారంలో రెచ్చగొట్టే కథనాలను ప్రసారం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయి జైలులో ఉన్న తొలి వెలుగు జర్నలిస్టు రఘు 13 రోజుల తర్వాత మంగళవారం నల్లగొండ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈనెల 3న మార్కెట్లో పండ్లు, కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి వెళ్లిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర […]
సారథి ప్రతినిధి, హైదరాబాద్: కొవిడ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం పదిరోజుల పాటు అనగా.. జూన్ 10వ తేదీ వరకు పొడిగించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్ లో జరిగింది. సమావేశానికి రాష్ట్రమంత్రులు హాజరయ్యారు. లాక్డౌన్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు […]
సారథి ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నారు. జూన్ 25వ తేదీలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ పూర్తికానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖపై చేసిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి చేరిన రైతులకు రైతుబంధు వర్తించనుంది. జూన్ 10 కటాఫ్ తేదీగా ఈ పథకం వర్తింపు ఉండనుంది. విత్తనాలు, ఎరువుల్లో కల్తీని అరికట్టాలని సీఎం సూచించారు. కల్తీ […]