సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలోకి ప్రవేశాలకు అడ్మిషన్లు నిర్వహించేందుకు గాను పరీక్ష తేదీని ప్రభుత్వం ఖరారుచేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గత ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్ ను వాయిదావేసింది. పరిస్థితులు కుదుటపడుతుండడంతో నవంబర్1న ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్15వ తేదీ వరకు గురుకుల వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న గురుకులాల్లో 48,240 సీట్ల కోసం 1,48,168 అప్లికేషన్లు వచ్చాయని […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం నవోదయ విద్యాలయంలో 2020–21 అకాడమిక్ ఆరవ తరగతిలో చేరేందుకు విద్యార్థుల ప్రవేశపరీక్షకు శుక్రవారం నోటిఫికేషన్విడుదలైందని ప్రిన్సిపల్ వీరరాఘవయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 80 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఐదవ తరగతి చదివిన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. సీబీఎస్ఈ బోధన ఉంటుంది. […]
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో ఎగ్జామ్ జరగనుంది. ఇందుకోసం తెలంగాణలో 79, ఏపీలో 23 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి జరిగే ఎంసెట్ కు 1,43,165 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సెప్టెంబర్3 నుంచి ఈనెల 7వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఎంసెట్ నిర్వహించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్సెంటర్లకు వచ్చే అభ్యర్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో […]
హైదరాబాద్: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా చాలా ఎంట్రెన్స్ఎగ్జామ్స్వాయిదాపడిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జామ్స్షెడ్యూల్ను వెలువరించింది. ఈనెల 31న టీఎస్ ఈసెట్, సెప్టెంబర్9 నుంచి 14 వరకు ఎంసెట్, సెప్టెంబర్21 నుంచి 24వరకు పీజీఈసెట్ ను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ లాంటి మాస్టర్ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లలో దరఖాస్తుచేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు http://braou.ac.in/ లేదా https://www.braouonline.in/ వెబ్సైట్లలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి 2020 సెప్టెంబర్ […]
హైదరాబాద్: ఎంసెట్, ఐసెట్ వంటి వాటికి ఆన్లైన్లో అప్లై చేయడం, వెబ్ కౌన్సెలింగ్, వెబ్ఆప్షన్లు నమోదుచేయడం వంటివి మనకు తెలుసు. కానీ రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో ముఖ్యంగా ఇంటర్మీయట్, డిగ్రీ లెవెల్లో అడ్మిషన్, ఎగ్జామ్స్ విషయంలో ఎలాంటి ఫ్రాడ్ జరిగేందుకు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్)కు అనే ఆన్లైన్ ప్రాసెస్ను తీసుకొచ్చింది. మొత్తం డిగ్రీ అడ్మిషన్లు ఆన్లైన్ ద్వారానే చేయనున్నారు.షెడ్యూల్ ఇలా..ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7 […]
కల్లూరు అర్బన్: కర్నూలు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ఐటీఐ కాలేజీల్లో 2020- 21 సంవత్సరానికి చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ నాయకల్లు సోలోమన్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు వెల రూ.10 మాత్రమే ఉంటుందని, పూర్తిచేసిన ఫారాలను ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కన్వీనర్/ప్రిన్సిపాల్ ప్రభుత్వ ఐటీఐ(బాలికలు), బి.తాండ్రపాడు, కర్నూలు చిరునామాకు పంపించాలని కోరారు.