Breaking News

Year: 2023

ఆ ఊరులో కల్లు లొల్లి!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: నాగర్​ కర్నూల్​ మండలంలోని నల్లవెల్లిలో కల్లు పంచాయితీ చినికి చినికి గాలివానగా మారింది. కాంట్రాక్టర్​ ముందస్తుగా రూ.2లక్షలు ఒప్పుకున్న విధంగా రూ.లక్ష ముట్టజెప్పాడు. మరో రూ.లక్ష ఇవ్వాల్సి ఉంది. తనకు మాముళ్లు ఇవ్వలేదని గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కల్లు అమ్మకాలను బంద్ చేయించాడు. దీంతో రోజువారీగా కల్లుకు అలవాటువాడిన వారు బిత్తరపోతున్నారు. ఇంతలో ఈ విషయం మరో ప్రజాప్రతినిధి దాకా వెళ్లింది. ఆయన తనకు సదరు లీడర్ తో ఉన్న రాజకీయ […]

Read More

జర్నలిస్టు సతీష్ చందర్ ను అరెస్టు చేయడం అప్రజా స్వామికం

-తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యుడు కందికొండ మోహన్సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ప్రముఖ జర్నలిస్ట్ సతీష్ చందర్ తో పాటు, జర్నలిజం కళాశాల కరస్పాండెంట్ గౌరీ , కవి జయరాజు ఇతర మేధావులను అప్రజా స్వామీక పద్ధతిలో అరెస్టు చేయడం సరైనది కాదని వారిని వెంటనే వారిని విడుదల చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్బంగా జర్నలిస్ట్ మోహన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం, […]

Read More

శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా?

  • February 17, 2023
  • God
  • Shiva
  • Comments Off on శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా?

సామాజికసారథి, వెబ్ డెస్క్​: శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. […]

Read More

నాసిరక పనులతో కారుకొండకు ప్రమాదమే

… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిసామాజిక సారధి , బిజినేపల్లి: పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్టు కింద జరుగుతున్న కారకొండ కట్ట నిర్మాణ పనులలో నాసిరక పనులతో కారుకొండ గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు . మంగళవారం మండల పరిధిలోని కారుకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా కారకొండ గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేశారు . ఈ […]

Read More

పేదల ప్రభుత్వానికి పట్టం కట్టాలి ….మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

  • February 14, 2023
  • తెలంగాణ
  • Comments Off on పేదల ప్రభుత్వానికి పట్టం కట్టాలి ….మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ , సామాజిక సారథి : పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన పేదల పార్టీని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువస్తేనే దళిత బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు . మంగళవారం తెలకపల్లి మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో హథ్ సే హథ్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా అక్కడికి […]

Read More

సవేరా సేవలు అభినందనీయం : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్

  • February 13, 2023
  • తెలంగాణ
  • Comments Off on సవేరా సేవలు అభినందనీయం : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్

సామాజిక సారథి , కర్నూల్:శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లే శివ స్వాముల కోసం సేవా శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని సవేరా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్ అభినందించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలినడకన నాగర్ కర్నూల్ ప్రాంతం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకునే శివ స్వాములు కోసం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ వద్ద ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి, షాహిస్తా న్యూ […]

Read More
నాగర్​ కర్నూల్​ లో ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీల చించివేత

నాగర్​ కర్నూల్​ లో ‘ఎమ్మెల్సీ కవిత’ ఫ్లెక్సీల చించివేత

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్​ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 220 జంటలకు ఉచితంగా సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఆదివారం ఉదయం నాగర్ కర్నూల్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఆమెకు స్వాగతం చెబుతూ నియోజవర్గవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. కానీ శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బిజినేపల్లి నుంచి పాలెం మధ్యలో మూడు ఫ్లెక్సీలను చించివేశారు. […]

Read More
బొల్లంపల్లిలో మాదిగ ఐక్యవేదిక కమిటీ ఎన్నిక

బొల్లంపల్లిలో మాదిగ ఐక్యవేదిక కమిటీ ఎన్నిక

సామాజికసారథి, వెల్దండ: మండలంలోని బొల్లంపల్లి(చల్లపల్లి)లో మాదిగ ఐక్యవేదిక కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్య​అతిథులుగా సమావేశానికి మాదిగ ఐక్యవేదిక నాయకులు కొయ్యల పుల్లయ్య, గుద్దటి కిస్టాల్​, కొమ్ము అంజయ్య ముఖ్య​అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్​ నాయకులు మీసాల అంజయ్య మాట్లాడుతూ.. మాదిగలు రాజకీయాలకు అతీతంగా ఏకమై తమ చైతన్యాన్ని చాటుకోవాలని కోరారు. ఎవరికైనా ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. భారతరత్న డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ […]

Read More