Breaking News

బొల్లంపల్లిలో మాదిగ ఐక్యవేదిక కమిటీ ఎన్నిక

బొల్లంపల్లిలో మాదిగ ఐక్యవేదిక కమిటీ ఎన్నిక

సామాజికసారథి, వెల్దండ: మండలంలోని బొల్లంపల్లి(చల్లపల్లి)లో మాదిగ ఐక్యవేదిక కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్య​అతిథులుగా సమావేశానికి మాదిగ ఐక్యవేదిక నాయకులు కొయ్యల పుల్లయ్య, గుద్దటి కిస్టాల్​, కొమ్ము అంజయ్య ముఖ్య​అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్​ నాయకులు మీసాల అంజయ్య మాట్లాడుతూ.. మాదిగలు రాజకీయాలకు అతీతంగా ఏకమై తమ చైతన్యాన్ని చాటుకోవాలని కోరారు. ఎవరికైనా ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. భారతరత్న డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ఆశయాలను సాధించేందుకు మనమంతా కంకణబద్ధులం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొమ్ము ప్రేమ్​ కుమార్​, గౌరవ అధ్యక్షుడిగా పకాడి వినోద్​ కుమార్​, ఉపాధ్యక్షుడిగా పకాడి ఈశ్వర్​, పోలే ప్రశాంత్​, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము జలంధర్​, కార్యదర్శులుగా పకాడి రామస్వామి, సంయుక్త కార్యదర్శులుగా పోలే వెంకటయ్య, భూత్కూరి అంజయ్య, కోశాధికారిగా పి.మహేశ్​, గౌరవ సలహాదారులుగా మాజీ ఎంపీపీ పకాడి జయప్రకాశ్​, కొమ్ము విజయ్​ కుమార్​, రామాంజనేయులు, జగదీశ్వర్​, శశికుమార్​.. కార్యవర్గ సభ్యులుగా మరో 30 మందిని ఎన్నుకున్నారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు

మాదిగ ఐక్యవేదిక కమిటీ ఎన్నిక సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు