ఓయూ నుంచే మొదలవ్వాలి బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆత్మీయ సమ్మేళనం సామాజికసారథి, హైదరాబాద్: బహుజన రాజ్యాధికార సాధన ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మొదలుకావాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నేతలు ప్రాతినిథ్యం వహిస్తేనే పేదల బతుకులు మారుతాయని అన్నారు. మనువాదుల కుట్రలు విప్పాలంటే బహుజన […]
హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలి దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలె లాండ్ పూలింగ్ చేపట్టి కాలనీలు నిర్మించాలి అద్భుతంగా టౌన్హాల్, మినీ ట్యాంక్బండ్ నిబద్ధతతో పనిచేసే కమిషనర్ ను నియమించండి ప్రాజెక్టు కాలనీవాసులకు ఇళ్లపట్టాలు నల్లగొండ అభివృద్ధిపై సీఎం కేసీఆర్సమీక్ష ఎమ్మెల్యే గాదరి కిశోర్కుటుంబానికి ముఖ్యమంత్రి, మంత్రుల పరామర్శ సామాజికసారథి, నల్లగొండ ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, […]
సామాజిక సారథి, శాయంపేట: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఈనెల30వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలానికి రానున్న సంగతి తెలిసిందే. అయితే అనివార్య కారణాలతో ఈ నెల 31కి కార్యాక్రమాన్ని మార్చినట్లు భూపాలపల్లి ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణ తెలిపారు. నాయకులు మారిన తేదీని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సామాజిక సారథి, హలియా: ఉద్యమకారులపై రౌడీషీట్లను ఎత్తివేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ హోంమంత్రి మహమూద్ అలీకి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన రౌడీషీట్లను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రౌడీషీట్లు ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని భగత్ తెలిపారు. హోంమంత్రికి వినతి పత్రం సమర్పించేందుకు పలువురు ఉద్యమకారులు అభినందనలు తెలియజేశారు.
భక్తుల పార్కింగ్కు మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్ నిర్మాణాలను ప్రారంభించనున్న మంత్రి తలసాని సామాజికసారథి, హైదరాబాద్: బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి ఆలయాభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు చేపట్టింది. ఎంతో ప్రసిద్ధిచెందిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలిరావడం, సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వాహనాల కారణంగా తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి సాధారణ ప్రయాణికులకు సైతం ఇక్కట్లు తప్పడం […]
సినిమా టిక్కెట్లపై కమిటీ నిర్ణయం మేరకు ముందుకు సినీఎగ్జిబిటర్లతో భేటీలో మంత్రి పేర్ని నాని భేటీ అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమిస్తూ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక ముఖ్య కార్యదర్శులు, […]
తయారీ సంస్థలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ కేంద్రమంత్రి మాన్సూఖ్ మాండవీయ ట్వీట్ న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కొవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింద. దీనికి జనవరి 1 నుంచి కొవిన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్లో కరోనా […]
సామజిక సారథి, వాజేడు: సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో 163 జాతీయ రహదారి పై గురువారం పేరూరు ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విస్తృత వాహనాల తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ .సివిల్ కానిస్టేబుల్ . తదితరులు పాల్గొన్నారు.