చెన్నై: అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఇంటి ఓనర్ను హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన చెన్నైలోని కుండ్రటూర్లో చోటుచేసుకున్నది. కుండ్రటూర్కు చెందిన గుణశేఖర్(51) ఇంట్లో కొంతకాలంగా ధనరాజ్ అనేవ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. అయితే నాలుగునెలలుగా ధనరాజ్ యజమానికి అద్దె కట్టడం లేదు. దీంతో బుధవారం రాత్రి రెంట్ కట్టాలంటూ గుణశేఖర్.. ధనరాజ్పై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కోపోధ్రిక్తుడైన ధనరాజ్ కుమారుడు అజిత్.. ఇంటి ఓనర్పై కత్తితో విచక్షణారహితంగా దాడిచేయడంతో అతడు […]
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్బాస్4లో ఆర్జీవీ పరిచయం చేసిన ‘నగ్నం’ హీరోయిన్ శ్రీరాపాకకు చోటు దక్కనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఆమె పలు యూట్యూబ్ చానెళ్లలో బోల్డ్ కామెంట్స్ చేస్తున్నట్టు టాక్. బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఇప్పటికే కంటెస్టంట్ల ఎంపిక ప్రక్రియ మొదలైందని టాక్. ఈ క్రమంలో ఈ షోలో పాల్గొనేందుకు గాను పలువురు సినీ తారలు పోటీ పడుతున్నారు. అయితే ఈ రేసులో ‘నగ్నం’ హీరోయిన్ శ్రీ రాపాక కూడా ఉన్నట్టు […]
తిరువనంతపురం: ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తుంటే.. కొందరేమో నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కేరళలోని ఓ రిసార్ట్లో జరిగిన విందులో సుమారు 300 మంది పాల్గొన్నట్టు సమాచారం. అనంతరం ఆ వీడియోలను సోషల్మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేరళలోని హిల్లీ జిల్లా ఉదుంబంచోలలో ఈ ఘటన చోటుచేసుకున్నది. రిసార్టు మేనేజర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 29న ఈ […]
సీనియర్ నటి జయంతి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆమె శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరినట్టు ఆమె కుమారుడు తెలిపారు. ప్రస్తుతం జయంతికి వెంటిలేటర్పై చికిత్స నందిస్తున్నారు. ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించగా, నెగిటివ్ గా తేలినట్టుగా తెలిపారు. ఆమె చాలాకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నట్టుగా సమాచారం. తెలుగు, కన్నడ, తమిళ, మరాఠి భాషల్లోని పలు చిత్రాల్లో జయంతి నటించారు. 1960లో ఆమె నటిగా కెరీర్ ఆరంభించారు. హీరోయిన్ […]
సారథి న్యూస్, మెదక్: నామినేటెడ్ పదవులపై అధికార పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇటీవల కొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ లకు కొత్త పాలకవర్గాల నియమించింది. దీంతో మెదక్ జిల్లాలో మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఆయ పదవుల కోసం జోరుగా లాబియింగ్ చేస్తున్నారు. మెదక్ జిల్లాలో పలు నామినేటెడ్ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. గత పాలక వర్గాల పదవీ కాలం ముగిసిపోయినప్పటికి కొత్త […]
చెన్నై: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మోసగాళ్ల రెచ్చిపోతున్నారు. కరోనాకు మందు కనిపెట్టామంటూ ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ ప్రకటించి.. ఆ తరువాత తూచ్ అంటూ నాలుక కరుచుకున్నది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ స్వీట్ షాప్ ఇదే తరహా మోసానికి పాల్పడింది. తమ దుకాణంలో తయారుచేసే మైసూర్ పిక్ తిని కరోనాను నయం చేసుకోవచ్చని ప్రచారం మొదలుపెట్టింది. అంతేకాక రూ.800 కిలో చొప్పున ఆ స్వీట్ను అమాయకులకు అంటగట్టింది. ఈ మైసూర్పాక్లో 19 రకాల […]
కశ్మీర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ నేతను కాల్చిచంపారు. జమ్ముకశ్మీర్లోని బందిపోర్లో బీజేపీ నేత వసీమ్ కుటుంబం నివాసం ఉంటున్నది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బీజేపీ నేత కుటుంబం ఓ దుకాణం వద్ద కూర్చొని ఉన్నది. ఇదే అదనుగా భావించిన ఉగ్రమూకలు అక్కడికి చొరబడి బీజేపీ నేత వసీమ్, అతడి తండ్రి బషీర్, సోదరుడు ఉమర్ బషీర్పై కాల్పులు జరిపారు. ఆ దుకాణం పోలీస్స్టేషన్కు సమీపంలో ఉన్నది. సమాచామందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని […]
కాన్పూర్: ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఈ క్రిమినల్ పోలీసులకు చిక్కాడు. వికాస్దూబే కోసం మూడు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలించారు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వికాస్దూబే ఉజ్జయినీలోని ఆలయం సమీపంలో కనిపించాడు. గమనించిన ఓ దుకాణ యజమాని పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గత శుక్రవారం వికాస్దూబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన ఎనిమిది […]