Breaking News

Month: July 2020

గ్రామదేవతలకు జలాభిషేకం

గ్రామదేవతలకు జలాభిషేకం

సారథి న్యూస్, హుస్నాబాద్: వర్షాలు కురవాలని గ్రామస్తులు, రైతులు బుధవారం మండలంలోని మాలపల్లిలో గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. సర్పంచ్ బత్తల మల్లయ్య మాట్లాడుతూ విత్తనాలు పెట్టి రోజులు దాటినా సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జలాభిషేకం చేస్తే వరుణుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకంతో పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఆంజనేయస్వామి విగ్రహాలకు జలాభిషేకం, ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

Read More
వీధి కుక్కలను తరలించండి

వీధి కుక్కలను తరలించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్​మున్సిపాలిటీలో వీధికుక్కలు కాలనీవాసులు, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని, వాటిని వెంటనే తరలించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ బుధవారం మున్సిపల్​ అధికారులను కోరారు. పందులు, కుక్కలను తరలించాలని గతంలో తీర్మానించినా అది కాగితాలకే పరిమితమైందన్నారు. సీజనల్ వ్యాధుల విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి వార్డులో దోమల మందు పిచికారీ చేయాలని కోరారు.

Read More
17వేల మార్క్​ దాటిన కరోనా

17వేల మార్క్​ దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒకేరోజు 1018 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు పాజిటివ్​కేసులు 17,357 నమోదయ్యాయి. ఇప్పటివరకు యాక్టివ్​కేసులు 9008 ఉన్నాయి. తాజాగా 8082 మంది రోగులు డిశ్చార్జ్​ అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి ఏడుగురు మృతి, ఇప్పటివరకు 267 మంది మృత్యువాతపడినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులిటెన్​ను పేర్కొంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్​ఎంసీ పరిధిలో 881 కేసులు, రంగారెడ్డి 33, మేడ్చల్​జిల్లాలో 36, మహబూబ్​నగర్​జిల్లాలో […]

Read More
మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం

మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బుధవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. వెల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు, చేగుంట మండలంలోని 3 గ్రామాలను కలిపి కొత్త మండలం ఏర్పాటు కానుంది. గతనెల 25న హరిత హారం కార్యక్రమ ప్రారంభం కోసం సీఎం కేసీఆర్ నర్సాపూర్ కు వచ్చిన సందర్భంగా […]

Read More
కళ్లకల్ సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు

సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా కలెక్టర్ ఓ సర్పంచ్ పై సస్పెన్షన్ వేటువేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోవడం, నిధుల దుర్వినియోగం నేపథ్యంలో మనోహరాబాద్ మండలం కళ్లకల్ సర్పంచ్ ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతనెల 6న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కళ్లకల్ గ్రామాన్ని సందర్శించారు. హరితహారం మొక్కలు చనిపోవడంతో పాటు తడి పొడి చెత్తను వేరు చేయకపోవడం, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపై కలెక్టర్ సర్పంచ్ […]

Read More

వ్యభిచారముఠా అరెస్ట్​

సారథిన్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీసులు తనిఖీ చేసి వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలోని ఓ ఇంజిరింగ్​ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీచేసి ముగ్గురు మహిళలతోపాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.

Read More

ఆన్​లైన్​ క్లాసుల పేరిట దోపిడీ

సారథి న్యూస్, చొప్పదండి: ప్రైవేట్​ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ పట్టణ ఉపాధ్యక్షుడు అనుమల్ల కోటేశ్ డిమాండ్​ చేశారు. ప్రైవేట్​, కార్పొరేట్​ విద్యాసంస్థలు కరోనా సాకుతో ఆన్​లైన్​ క్లాసులంటూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని శక్తిభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సమయంలో అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలన్నారు. చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంతోష్, సాయి గణేష్, లక్ష్మీపతి, అఖిల్, […]

Read More

పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత

సారథిన్యూస్​, నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం ఆమె నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ నిగిడాల సురేశ్​, ఎస్​ఐ గుత్తా వెంకట్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్, సతీశ్​, రాము, షకీల్, కిరణ్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Read More