హాంకాంగ్: ఇండియాలో ఇప్పటికే నిషేధానికి గురైన టిక్టాక్ దాదాపు 6బిలియన్ డాలర్ల నష్టాన్ని మూతగట్టుకుంది. అమెరికా కూడా దాన్ని నిషేధించాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్ నుంచి కూడా టిక్టాక్ నిష్క్రమించింది. మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో దాదాపు 1.50లక్షల మంది యూజర్లను టిక్టాక్ కోల్పోనుంది. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ చైనా పార్లమెంట్ ఈ మధ్య కాలంలో జాతీయ భద్రతా చట్టానికి ఆమోదం తెలిపింది. అక్కడ నిరసనలు మొదలయ్యాయి. సోషల్ మీడియా […]
జార్ఖండ్: లిక్కర్ఫ్యాక్టరీని తనిఖీ చేయడం పోలీసులకు తలనొప్పులు తెచ్చింది. సదరు లిక్కర్ ఫ్యాక్టరీ యజమానికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఇప్పుడు తనిఖీకి వెళ్లిన 42 మంది పోలీసులు కరోనా వచ్చిందేమోనని భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని కోడేర్మా జిల్లాకు చెందిన 45 మంది పోలీసులు శనివారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ లిక్కర్ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. వాళ్లలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆ కేసులో అరెస్టైన వ్యక్తికి […]
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. 24 గంటల్లో మొత్తం 22,252 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం నాటికి కేసుల సంఖ్య 7,19,665కి చేరిందని కేంద్ర హెల్త్మినిస్ట్రీ బులిటెన్ విడుదల చేసింది. 467 మంది చనిపోయారు. నాలుగు రోజుల్లో కేసుల సంఖ్య ఆరులక్షల నుంచి ఏడులక్షలకు చేరింది. ఈ నెల 3 నుంచి దాదాపు రోజు 20వేల కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల్లో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరిన ఇండియాలో మరణాల రేటు మాత్రం […]
లక్నో: దేశంలోనే సంచలనం సృష్టించిన వికాస్దూబే కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వికాస్ దుబేను పట్టుకొనేందుకు వెళ్లిన 8 మంది పోలీసులను అతడి అనుచరులు దారుణంగా కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వికాస్దూబేకు కొందరు పోలీసులే సహకరించినట్టు విచారణలో తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు వికాస్దూబేతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు ఉన్న 200 మంది పోలీసులపై నిఘా పెంచారు. ముఖ్యంగా చౌబేపూర్ పోలీస్స్టేషన్లో పనిచేసిన, పనిచేస్తున్న వారిపై ప్రత్యేక […]
న్యూఢిల్లీ: గడిచిన రెండు నెలల్లో 200 శాతం సైబర్ ఎటాక్స్ పెరిగాయని పీఎంవో అధికారి గుల్షన్ రాయ్ పేర్కొన్నారు. అయితే చైనా –ఇండియా మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అవి పెరిగాయనే దానికి సాక్ష్యాలు లేవని ఆయన అన్నారు. ‘పిషింగ్, రాన్సమ్వేర్ ఎక్కువయ్యాయి. జనవరి, ఫిబ్రవరి చివన నుంచి ఈ కేసులు ఎక్కువయ్యాయి. టెన్షన్ పరిస్థితులు దృష్ట్యా పెరగలేదు’ అని ఆయన చెప్పారు. ఆఫీసులు అన్నీ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, పర్సనల్ కంప్యూటర్స్లో కూడా అప్లికేషన్లు డౌన్లోడ్ […]
శ్రీనగర్: పాక్ ఆక్రమిత్ కశ్మీర్ (పీవోకే)లో చైనాకు వ్యతిరేకంగా సోమవారం ఆందోళనలు జరిగాయి. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్లో అక్కడి ప్రజలు నిరసన చేపట్టారు. ‘సేవ్ రివర్స్, సేవ్ జమ్మూ’ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపైన్ స్టార్ట్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు ఏ ప్రాతిపదికన చేసుకున్నారని నిరసనకారులు ప్రశ్నించారు. ఈ విషయంలో రెండు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. […]
సారథి న్యూస్, సిద్దిపేట: కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని సిద్దిపేట పోలీసులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఊరూరూ తిరిగి కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజాచైతన్య రథం ద్వారా ఎల్ఈడీ స్క్రీన్ ను చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం దుబ్బాక పీఎస్ పరిధిలోని అప్పనపల్లి, పెద్దగుండవెల్లి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు మాట్లాడిన […]
సారథిన్యూస్, మంచిర్యాల/ సిద్దిపేట/చిన్నకోడూర్ : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆర్మ్డ్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఆయన మొక్కలు నాటారు. మరోవైపు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలోని హరీశ్రావు కాలనీలో సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు అధ్వర్యంలో మొక్కలు నాటారు. చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై సాయికుమార్, సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ […]