సారథి న్యూస్, అలంపూర్: ఆలంపూర్ జోగుళాంబ పుణ్యక్షేత్రం ఆవరణలో మొక్కలు నాటి ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్చైర్మన్వెంకటేశ్, కమిషనర్మదన్మోహన్గురువారం ప్రారంభించారు. హరితహారం స్వర్ణహారం కావాలని వారు ఆకాంక్షించారు. మున్సిపాలిటీలో ఒక్కో వార్డులో వంద మొక్కల చొప్పున నాటడమే కాకుండా ప్రతి ఇంటికి మూడు మొక్కల చొప్పున నాటాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ ఆఫీసుల మైదానాల్లో మొక్కలు నాటాలని సంకల్పించారు. అంతకుముందు ప్రభుత్వ జూనియన్ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పుష్పలత, జయలక్ష్మి, టీఆర్ఎస్ […]
కలప అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రత్యేక విభాగం మొక్కలకు కుటుంబసభ్యుల పేర్లు పెట్టుకోవాలె నర్సాపూర్ లో మొక్కలు నాటిన సీఎం కేసీఆర్ అట్టహాసంగా ఆరో విడత హరితహారం ప్రారంభం సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణే హరితహారం ముఖ్య ఉద్దేశమని సీఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మనం చేతులారా పోగొట్టుకున్న అడవిని తిరిగి మనమే వందశాతం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ లో మొక్కలు నాటి ఆరో విడత […]
సారథి న్యూస్, కర్నూలు: ఇండియా బోర్డర్లోని గాల్వాన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్యకు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని, ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి వస్తువులను బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి పిలుపునిచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించే అవకాశం భారత ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ప్రతిఒక్కరికీ కల్పించారని పేర్కొన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి పౌరుడు మేడిన్ ఇండియా వస్తువులనే కొనాలని కోరారు.
లండన్: ఇండియా – చైనా మధ్య నెలకొన్న గొడవను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యూకే ప్రధాని బొరిస్ జాన్సన్ అన్నారు. ‘ఒక దేశం కామన్ వెల్త్ మెంబర్, మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ ఒకవైపు. ప్రజాస్వామ్యం అనే మన భావనను సవాలు చేసే రాష్ట్రం. రెండు దేశాల మధ్య జరుగుతున్న సంఘటనలను యూకే నిశితంగా పరిశీలిస్తోంది’ అని అన్నారు. ఈస్ట్రన్ లద్దాఖ్లో పరిస్థితి సీరియస్గా, ఆందోళనకరంగా ఉందన్నారు. రెండు దేశాలు మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నామన్నారు. […]
న్యూఢిల్లీ: కరోనా ప్రబలుతున్న కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఎగ్జామ్స్ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. గురువారం విచారణ జరిగిన సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన తుషార్ మెహతా ఈ విషయాన్ని కోర్టుకు చెప్పారు. జులై 1 నుంచి 15 వరకు జరగాల్సిన సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వాటితో పాటు ఐసీఎస్ఈ పరీక్షలను కూడా క్యాన్సిల్ చేశామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ, […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. 24 గంటల్లో 19,085 టెస్టులు చేయగా, 553 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన వారిలో 477 మందికి పాజిటివ్ రాగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి ఏడుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రానికి చెందిన వారి కేసుల సంఖ్య 8783 కాగా.. విదేశాలకు చెందిన వారి సంఖ్య 371, […]
బెంగళూరు: పరీక్షలంటే పెన్ను, అట్ట, పెన్సిల్ పట్టుకుని వెళ్తాం. కానీ ఈ కరోనా కాలంలో శానిటైజర్, మాస్కు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో గురువారం టెన్త్ ఎగ్జామ్స్ప్రారంభమయ్యాయి. ఏ స్టూడెంట్ చేతిలో చూసినా శానిటైజర్, మాస్క్లే కనిపించాయి. సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ, మాస్కులుపెట్టుకుని స్క్రీనింగ్ చేయించుకుంటూ కనిపించారు. రాష్ట్రంలో మొత్తం 8లక్షల మంది స్టూడెంట్స్కు కర్ణాటక ప్రభుత్వం ఎగ్జామ్స్నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో స్టూడెంట్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. ‘పదో తరగతి అనేది విద్యార్థుల […]
జైపూర్: ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా కరోనా కోసం తయారు చేసిన మందుపై చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ మెడిసిన్ను మహారాష్ట్రలో అమ్మనివ్వబోమని మంత్రి ప్రకటించారు. కాగా ఇప్పుడు రాజస్థాన్ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్లినికల్ ట్రయల్స్ కోసం ఆ డ్రగ్ను రాష్ట్రానికి పంపలేదని, దాన్ని అమ్మేందుకు పర్మిషన్ కూడా ఇవ్వలేదని రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ రఘువర్మ చెప్పారు. ‘స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మనుషులపై డ్రగ్ ట్రయల్ చేసేందుకు పర్మిషన్ […]