సారథిన్యూస్, ములుగు: మొక్కలతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. బుధవారం ఆమె ములుగు జిల్లాలోని తన జగ్గన్నపేటలో తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో వెంకన్న, రామచందర్, ముతయ్య భూషన్ తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు కిడ్నాప్ అయ్యింది. బంధువులే ఆమెను కిడ్నాప్ చేశారని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని రెడ్డిపాలెనికి చెందిన అశోక్రెడ్డి, పూజిత ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఏపీలోని ఓ దేవాలయంలో వారు వివాహం చేసుకున్నారు. అనంతరం బూర్గంపాడు ఠాణాకి వెళ్లి తమ పెళ్లి విషయం చెప్పారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి […]
సారథి న్యూస్, చొప్పదండి: జన్యుపరమైన వ్యాధితో ఇబ్బందులు బాధపడుతున్న ఓ యువతికి సెల్పాయింట్ యూనియన్ సభ్యులు ఆర్థిక సాయం అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన సిరిపురం ప్రసాద్, రూప కూతురు జాహ్నవి డిగ్రీ చదువుతోంది. ఆమె కొంతకాలంగా జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. వైద్యానికి నెలకు రూ.ఆరువేలు ఖర్చవుతున్నది. తల్లిదండ్రులు పేదరికంతో బాధపడుతున్నారు. దీంతో చొప్పదండి సెల్పాయింట్ యూనియన్ బాధిత కుటుంబానికి రూ.ఆరువేలు ఆర్థికసాయం అందించగా.. కానిస్టేబుల్ శ్రీనివాస్ రూ.వెయ్యి ఆర్థికసాయం అందించారు.
సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి వివరించారు. గురువారం మెదక్జిల్లా నర్సాపూర్అటవీ ప్రాంతంలో సీఎం కేసీఆర్మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, మెదక్జిల్లా కలెక్టర్ధర్మారెడ్డి కలిసి అటవీప్రాంతాన్ని పరిశీలించారు. నర్సాపూర్ అర్బన్పార్కులో సీఎం ఆరు మొక్కలు నాటుతారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 182 […]
సారథి న్యూస్, హైదరాబాద్: అత్యధునిక హంగులతో యుద్ధప్రాతిపదికన గచ్చిబౌలిలో టిమ్స్ దవాఖానను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన హాస్పిటల్ను సందర్శించారు. ఇక్కడ వెయ్యి బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, మరో మూడు నాలుగు రోజుల్లో దవాఖానా ప్రారంభమవుతుందన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి డాక్టర్లు వైద్యం చేస్తున్నారని, అలాంటి వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లోనూ ఐసీయూ, వెంటిలేటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గాంధీ ఆస్పత్రి […]
ఢిల్లీ: కరోనాకు ఆయుర్వేద మందును తీసుకొచ్చినట్లు ప్రకటించిన పతంజలి సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయుర్వేద ఔషధం ‘కరోనిల్’కు సంబంధించి చేస్తున్న ప్రచారాన్ని తక్షణం నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనిల్కు సంబంధించి నిర్వహించిన పరిశోధనల పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. పతంజలి చెబుతున్న అంశాలపై వాస్తవాలు, శాస్త్రీయ అధ్యయన వివరాలు తమకు తెలియవని పేర్కొన్నది. పతంజలి సంస్థ మంగళవారం ఆయుర్వేద మందు కరోనిల్ను అట్టహాసంగా ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ […]
ముంబై: గాల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఐదురోజుల్లో చైనా మన దేశంలో 40,300 సైబర్ ఎటాక్స్ చేసేందుకు యత్నించిందని పోలీసులు చెప్పారు. ఎక్కువ శాతం ఎటాక్స్ అన్నీ బ్యాంకింగ్, ఐటీ సెక్టార్పైనే జరిగాయని మహారాష్ట్ర సైబర్ వింగ్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశశ్వి యాదవ్ అన్నారు. మహారాష్ట్ర సైబర్ వింగ్, స్టేట్ పోలీస్ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ శాతం సైబర్ ఎటాక్స్ అన్నీ చైనాలోని చెంగ్డూ ఏరియా నుంచి జరిగాయని తెలుస్తోంది. […]
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక కేసులు నమోదై.. మహారాష్ట్ర తర్వాతి ప్లేస్లో ఉన్న ఢిల్లీలో కరోనా అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తలు చేస్తోంది. ఈ మేరకు కరోనా వైరస్ రెస్పాన్స్ ప్లాన్ను అధికారులు రివైజ్ చేశారు. దాంట్లో భాగంగానే జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంట్లో కరోనా టెస్టులు నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఈనెల 30 నాటికి స్క్రీనింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్కు సంబంధించి ఈ […]