సారథిన్యూస్, మహబూబాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలను ఉచితంగా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. కరోనా టెస్టుల్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ఆయన మహబూబాబాద్లోని పెరుమాండ్ల భవన్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికి కరోనా టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: సర్కార్ సబ్సిడీపై రైతులకు అందిస్తున్న సోయాబీన్ బస్తాలు కోసం గత శుక్రవారం కంగ్టిలో ఒకరికొకరు రైతులు తోసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్క్లు కట్టుకోకుండానే విత్తనాల కోసం వచ్చారు. ఈ విషయమై ‘సారథి’లో ‘నో మాస్క్.. నో డిస్టెన్స్’ శీర్షిక వచ్చిన వార్తా కథనానికి స్థానిక అధికారులు స్పందించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంతో పాటు తడ్కల్ గ్రామంలో వ్యవసాయ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా బారినపడిన జర్నలిస్టులకు తక్షణ సహాయం కింద రూ.20వేలు, క్వారంటైన్లో ఉన్న జర్నలిస్టుకు రూ.10 వేల సాయం అందిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టు వివరాలను వెంటనే 8086677444, 9676647807 నంబర్లకు పంపించి సహాయం పొందగలరని కోరారు.
సారథిన్యూస్, ఖమ్మం రూరల్: ఆలయభూముల్లో అక్రమనిర్మాణాలను తొలగించి కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అఖిలభారత బ్రాహ్మణ సర్వీస్ నెట్వర్క్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రంగారావు, రావులపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దేవాలయ భూములను దేవాదాయశాఖ అధికారులు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దేవాలయ ఆస్తులను కబ్జాలు చేయడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. సంగమేశ్వర ఆలయానికి చెందిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపించారు. కాగా దేవాదాయశాఖ అధికారులు […]
సుశాంత్ సింగ్ రాజ్పుత్కు ధోని బయోపిక్ ఎంతో పేరుతెచ్చింది. మహేంద్రసింగ్ ధోని పాత్రలో జీవించిన సుశాంత్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇవాళ సుశాంత్ సేవలను దేశమంతా గుర్తుచేసుకుంటున్నదంటే అందుకు కారణం ధోని చిత్రమేనని చెప్పకతప్పదు. సుశాంత్ తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. ‘ఎం.ఎస్.ధోని’ ఒకెత్తు. ఈ చిత్రం తెలుగుతోపాటు ఇతర భాషల్లోకీ డబ్ కావడంతో సుశాంత్ టాలెంట్ అందరికీ తెలిసింది. అందుకే అతడి మరణవార్త విన్న మహేష్ బాబు, ఎన్టీయార్, రామ్ చరణ్ వంటి తెలుగు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ టెస్టు రేటును రూ.2,200గా నిర్ణయించినట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఒక్కోరోజుకు వెంటిలేటర్పై లేకుండా ఐసీయూలో ఉంచితే రూ.7,500, వెంటిలేటర్పై ఉంచితే రూ.9వేలు ఛార్జీ వసూలు చేస్తారని చెప్పారు. కరోనాపై ఉన్నతస్థాయిలో నిత్యం సమీక్ష చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ చెప్పిందన్నారు. కరోనా లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయబోరని, లక్షణాలు ఉన్నవారికే టెస్టులు చేయాలని మార్గదర్శకాలు ఇస్తున్నామని మంత్రి ఈటల చెప్పారు.
సారథి న్యూస్, మహబూబ్నగర్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియట్, ఒకేషనల్ కళాశాలల్లో ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సంస్థ వెబ్సైట్ www.tswreis.ac.inలో అందుబాటులో ఉంచినట్టు గురుకులాల మహబూబ్ నగర్ రీజినల్ కోఆర్డినేటర్ ఫ్లారెన్స్రాణి తెలిపారు. వీటితోపాటు 6 నుంచి 9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు సోమవారం వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆయా స్కూళ్ల ప్రిన్సిపాల్స్ సమాచారం అందిస్తారని చెప్పారు. […]
ప్రముఖ దర్శకుడు సురేందర్రెడ్డి ఓ వెబ్సిరీస్కు దర్శకత్వం వహించబోతున్నాడంటూ సినీవర్గాల్లో జోరుగా టాక్నడుస్తున్నది. తెలుగులో ఇప్పటివరకు ఏ దర్శకుడు టచ్చేయని ఓ ప్రయోగాత్మక కథకు సిరీస్కు ఆయన దర్శకత్వం వహించబోతున్నారట. ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహాలో దీన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం. సురేందర్రెడ్డి తెలుగులో సైరా నరసింహారెడ్డి, కిక్ సహా ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సైరా తరువాత మరో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వరుణ్తేజ్తో ఓ సినిమాను […]