Breaking News

ఎన్​ఆర్​ఐ ఔదార్యం

పేద యువతికి ఎన్నారై సాయం

సారథి న్యూస్, రామడుగు: పేద యువతి వివాహానికి సహాయంచేసి ఓ ఎన్​ఆర్​ఐ పెద్దమనసు చాటుకున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగుకు చెందిన తోట సత్యం అమెరికాలో స్థిరపడ్డారు. తన సొంత గ్రామానికి చేతనైన సాయం చేస్తుంటాడు. రామడుగుకు చెందిన జిట్టవేని రజిత అనే యువతికి కొంతకాలం క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. ఈ క్రమంలో ఆమె వివాహానికి సత్యం రూ.20వేల సాయం చేశారు. ఈ మొత్తాన్ని గ్రామ సర్పంచ్​ ప్రమీల జగన్​మోహన్​గౌడ్ కు పంపించగా ఆమె బాధిత యువతికి అందజేశారు. యువజన కాంగ్రెస్​ నాయకుడు నాగిశేఖర్​, వార్డు సభ్యుడు నీలం రవి తదితరులు పాల్గొన్నారు.