Breaking News

RAMAYAMPET

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సారథి, రామాయంపేట: ఈ వర్షాకాలంలో వరిపంటనే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పత్తి, పప్పు దినుసులు, నూనెగింజలను సాగు చేయాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. గురువారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో వానాకాలం పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇచ్చే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు […]

Read More
నకిలీ సీడ్స్ అమ్మితే కఠినచర్యలు

నకిలీ సీడ్స్ అమ్మితే కఠిన చర్యలు

సారథి, రామాయంపేట: ఈ వానాకాలం సీజన్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, ఎవరైనా సీడ్ షాప్ ఓనర్లు నకిలీ సీడ్స్ ను రైతులకు అంటగడితే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీచేసి స్టాక్ రిజిస్టర్, ధరల పట్టిక, బిల్లు బుక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే సంకల్పంతో వ్యవసాయశాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో […]

Read More
నకిలీ సీడ్స్ అమ్మితే జైలుకే

నకిలీ సీడ్స్ అమ్మితే జైలుకే

సారథి, రామాయంపేట: నకిలీ సీడ్స్, ఫర్టిలైజర్ గానీ రైతులకు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసునమోదు చేసి జైలుకు పంపిస్తామని నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ ఫర్టిలైజర్ షాప్ దుకాణాల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పలు విత్తన, ఫర్టిలైజర్ షాపులను ఆయన తన సిబ్బందితో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ సీడ్స్ గురించి ఎలాంటి సమాచారం రైతుల దగ్గర ఉన్నా పోలీస్ సిబ్బంది, […]

Read More
పూటికమట్టితో పంటలకు జీవం

పూడిక మట్టితో పంటలకు జీవం

సారథి, రామాయంపేట: ఉపాధి హామీ పథకం ద్వారా తీస్తున్న పూడిక మట్టి పంటలకు సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. రైతుల పంట సాగుకు అయ్యే ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. భూసారం పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులు సూచిస్తున్నారు. ఉపాధి హామీ పనులు పనిచేస్తున్న కూలీల వద్ద నుంచి ఉచితంగా పూడికమట్టిని తీసుకోవచ్చని, ట్రాక్టర్ కిరాయి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.పూడిక మట్టితో లాభాలు ఇవే […]

Read More
రెక్కలకష్టం వర్షార్పణం

రెక్కలకష్టం వర్షార్పణం

సారథి, రామాయంపేట: ఆరుగాలం శ్రమించి పండించిన బుధవారం రాత్రి కురిసిన భారీవర్షానికి నీటిపాలైంది. రెక్కలకష్టం మట్టిలో కలిసిందని ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిజాంపేట గ్రామానికి చెందిన చౌదర్ పల్లి స్వరూప. తనకున్న రెండెకరాల్లో యాసంగి సీజన్ లో వరి పంట సాగుచేసింది. వరి నూర్పిడి చేసి నెలరోజుల క్రితం నిజాంపేట వ్యవసాయ సబ్ మార్కెట్ లో నిజాంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ కు వడ్లను తీసుకొచ్చింది. ‘మా ఆయన ఆరోగ్యం […]

Read More
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి

సారథి, రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో భారీఎత్తున అవినీతి జరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. మొన్న సుతారి పల్లి, నిన్న క్యాట్రియల్ గ్రామంలో రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఒక్కో సంచికి 8కిలోల వరకు ఎక్కువ తూకం వేశారని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు శివరాములు, పట్టణాధ్యక్షుడు శంకర్ గౌడ్, ప్రదానకార్యదర్శి […]

Read More
కాల్చొద్దు.. కలియ దున్నుదాం

కాల్చొద్దు.. కలియ దున్నుదాం

పంటల వ్యర్థాలను దున్ని భూసారం పెంచవచ్చు పొలాల్లో నిప్పుతో పంటకు ముప్పే అవగాహన లేక వరిగడ్డి, పత్తిలొట్టను కాలుస్తున్న రైతులు హాని కలుగుతుందంటున్న వ్యవసాయ నిపుణులు వరి కోతల తర్వాత రైతులు వరి పండించిన మడులలో ఉన్న వరి గడ్డిని మంటపెడుతుంటారు. దీంతో నేలకు సారాన్ని ఇచ్చే క్రిమికీటకాలు చనిపోవడంతో పాటు భూసారం సమతుల్యత దెబ్బతిని తద్వారా సాగుచేసే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరి గడ్డిని కాల్చివేయకుండా భూమిలోనే కలియ దున్నితే ప్రయోజనకరంగా ఉంటుందని […]

Read More
రైతులకు అండగా రైతు సహాయ వేదిక

రైతులకు అండగా రైతు సహాయ వేదిక

సారథి, రామాయంపేట: విద్యుత్ తీగల స్తంభాల మధ్య దూరం తగ్గించి పంట పొలాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని రైతు సహాయ వేదిక మెదక్ జిల్లా ప్రతినిధులు డి వెంకటేశం, ఎ.రవీందర్ సంబంధిత శాఖ అధికారులను కోరారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బత్తుల బాబు అనే రైతు ఎకరా పొలంలో వరి పంట సాగుచేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో అరెకరా పొలం అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలుసుకున్న రైతు సహాయ వేదిక గ్రూప్ […]

Read More