Breaking News

POWERHOUSE

శ్రీశైలం పవర్​హౌస్​లో మరోసారి మంటలు

శ్రీశైలం పవర్​హౌస్​లో మరోసారి మంటలు

సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీశైలం పాతాళగంగ ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి మంటలు చెలరేగాయి. బతుకుజీవుడా అంటూ సిబ్బంది పరుగులు తీశారు. కరెంట్ ​కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది చెప్పారు. అయితే ప్రమాద తీవ్రతను అధికారులు పరిశీలిస్తున్నారు. లాన్​కు ఎలాంటి ప్రమాదం లేదని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనతో జెన్​కో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హతాశులయ్యారు. పొగలు కమ్ముకుంటుండడంతో […]

Read More
పవర్​హౌస్​దుర్ఘటనపై లోతైన విచారణ

పవర్​హౌస్ ​దుర్ఘటనపై లోతైన విచారణ

సారథి న్యూస్​, హైదరాబాద్​: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలోకి బయట నుంచి వాటర్ వచ్చే అవకాశమే లేదని జెన్​కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఈనెల 20న వపర్​హౌస్​లో జరిగిన ప్రమాదంపై విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు ఇంజనీర్లు, ఇద్దరు ఒక బ్యాటరీ కంపెనీ ప్రతినిధులు మరణించడం చాలా బాధాకరమన్నారు. అగ్నిప్రమాదం సమయంలో యూనిట్స్ ట్రిప్ కావలసి ఉంటుంది.. కానీ ఎందుకు ఆటోమేటిక్ గా ట్రిప్ కాలేదో విచారణ […]

Read More
రూ.కోటి పరిహారం.. ఉద్యోగం ఇవ్వాలి

రూ.కోటి పరిహారం.. ఉద్యోగం ఇవ్వాలి

సారథి న్యూస్, పాల్వంచ: శ్రీశైలం ఎడమ గట్టు పవర్​హౌస్​ ప్రమాదంలో మృతిచెందిన విద్యుత్​శాఖ ఉద్యోగుల బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) డిమాండ్ ​చేశారు. ఇటీవల పవర్ హౌస్​లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన పాల్వంచ ఇందిరా నగర్ కాలనీకి చెందిన జూనియర్ ప్లాంట్ అటెండెంట్​ కిరణ్​ కుమార్​ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబసభ్యులను ఆదివారం పరామర్శించారు. కేంద్ర […]

Read More
ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్ట్​

శ్రీశైలం వెళ్తున్న రేవంత్​రెడ్డి అరెస్ట్​

సారథి న్యూస్​, అచ్చంపేట: తెలంగాణ పరిధిలోని శ్రీశైలం పాతాళగంగ జెన్​కో పవర్​హౌస్​లో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ప్రమాదస్థలిని పరిశీలించేందుకు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డిని నల్లగొండ జిల్లా డిండి వద్ద పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్​స్టేషన్​కు తరలించారు. సంఘటన జరిగిన తీరును తెలుసుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని, విచారణకు ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని తనను […]

Read More
శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి బృందం

శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి బృందం

సారథి న్యూస్, కర్నూలు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బృందం శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు ను సందర్శించి గేట్లను పరిశీలించి.. డ్యాంకు వస్తున్న వరద పరిస్థితి, ఇన్​ఫ్లో, ఔట్​ ఫ్లో వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యాం ఎడమ గట్టున ఉన్న తెలంగాణ జెన్​ కో పవర్ హౌస్ […]

Read More
ఉద్యోగులను కాపాడుకోలేకపోయాం..

ఉద్యోగులను కాపాడుకోలేకపోయాం..

శ్రీశైలం పవర్​హౌస్ ​ఘటన చాలా దురదృష్టకరం బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా సాయం విచారం వ్యక్తంచేసిన విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి సారథి న్యూస్, అచ్చంపేట: శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన సంఘటన దురదృష్టకరమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే అర్ధరాత్రి బయలుదేరి సంఘటన స్థలికి 2.30 గంటలకు చేరుకున్నా ఉద్యోగులను దక్కించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జెన్​కో పవర్​హౌస్​లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన జెన్​కో ఉద్యోగుల పార్థివదేహాలను […]

Read More
ఏపీ సీఎం జగన్​శ్రీశైలం టూర్​రద్దు

ఏపీ సీఎం జగన్​ శ్రీశైలం టూర్​ రద్దు

శ్రీశైలం ఎడమగట్టు పవర్​హౌస్​ ప్రమాదంపై దిగ్భ్రాంతి సహాయ సహకారాలు అందించాలని అధికారులకు ఆదేశాలు సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి శుక్రవారం శ్రీశైలం పర్యటనను రద్దుచేసుకున్నట్లు సీఎంవో అధికారులు వెల్లడించారు. వరుసగా రెండవ ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి శ్రీశైలం వెళ్లాల్సి […]

Read More
శ్రీశైలం.. జెన్​కో పవర్​హౌస్​లో అగ్నిప్రమాదం

శ్రీశైలం.. పవర్​హౌస్​లో అగ్నిప్రమాదం

సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టీఎస్ జెన్ కో విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్​లోని ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం సంభవించి మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. జీరో లెవెల్ నుంచి సర్వీస్ బే వరకు మంటలు వ్యాపించాయి. ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. […]

Read More