భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్ భయబ్రాంతులకు గురైన రైతులు ఖండించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సామాజికసారథి, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి పూర్తి పరిహారం అందక నిరసనలు చేపడుతున్న భూనిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్చేశారు. తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రత్యేక పోలీసు బలగాలు వచ్చి నిర్వాహిత రైతులపై కర్కశంగా దాడిచేశాయి. నిర్వాసితులను ఏ పోలీస్స్టేషన్కు తరలిస్తున్నారో తెలియకుండా భయబ్రాంతులకు గురయ్యారు.గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై దాడి చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని కాంగ్రెస్ మాజీ […]
సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజారాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు రాకపోకలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే మంగళవారం స్వామివారిని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. తదనంతరం వారికి స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదం అందజేశారు. పొన్నం వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
సారథి న్యూస్, చొప్పదండి: ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభన కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజల్,పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలు కరీంనగర్జిల్లా చొప్పదండి ఎన్టీఆర్చౌరస్తా నుంచి తహసీల్దార్ ఆఫీసుకు వరకు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్రజితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్మేడిపల్లి సత్యం, పట్టణాధ్యక్షుడు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ముద్దం తిరుపతి, గుర్రం రమేష్ పాల్గొన్నారు.