కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్కాట్ చేస్తున్నాం పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ఉభయసభల టీఆర్ఎస్ సభ్యులు నల్లటి దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. అయితే విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఐదు నిమిషాలకే వాయిదా పడింది. లోక్సభ మాత్రం విపక్షాల నినాదాల మధ్యే కొనసాగుతుండగా టీఆర్ఎస్ సభ్యులు […]
ధాన్యం కొనుగోళ్లపై పట్టువీడని టీఆర్ఎస్ తెలంగాణలో ధాన్యం దిగుబడి పెరిగిందన్న నామా ప్రొక్యూర్మెంట్ పాలసీ ప్రకటించాలని డిమాండ్ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై ఐదోరోజూ గురువారం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగింది. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు.. వెల్లోకి దూసుకువెళ్లి రైతులను కాపాడాలని నినాదాలు చేశారు. […]
సామాజిక సారథి, వెల్డండ: బీసీ గణన చేపట్టాలనే డిమాండ్తో ఈనెల 8న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపట్టే పార్లమెంట్ముట్టడి కార్యక్రమాన్ని బీసీలు విజయవంతం చేయాలని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నకినమోని పెద్దయ్య యాదవ్ కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలకులు అక్రమ సంపాదన ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజాసమస్యలను గాలికి వదిలేశారని, సెటిల్ మెంట్ల మీద ఉన్న ప్రేమ ప్రజాసమస్యలపై చూపడం లేదన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా […]
న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ను దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం 100 ఏళ్ల పురాతన భవనమని, భద్రతాపరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఏవైనా తీవ్రమైన అగ్నిప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని ఆ అఫిడవిట్లో తెలిపింది. అందుకే ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం తెలిపింది. ‘ఈ భవనాన్ని 1921 […]