Breaking News

NARAYANAKHED

పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

సారథి, పెద్దశంకరంపేట: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని నారాయణఖేడ్​ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆయన మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కొత్తగా మంజూరైన 161 రేషన్​కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు ఆకలి బాధ ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో నూతనంగా రేషన్​ కార్డులను అందజేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాంతంలో 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో […]

Read More
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సారథి, పెద్దశంకరంపేట: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలో సహకార సంఘం ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. జొన్నలు క్వింటాలుకు రూ.2,620 చెల్లిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తోందన్నారు. దేశంలోనే […]

Read More
రైస్ మిల్లు ప్రారంభం

రైస్ మిల్లు ప్రారంభం

సారథి: పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం బొడగట్టు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్లును నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంత రైతులకు ఇది ఎంతో సదుపాయంగా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, రైస్ మిల్లు యాజమాన్యం కనకరాజు, కందుకూరి రవి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Read More
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

పేదలు ఆర్థికంగా ఎదగాలి

సారథి, పెద్దశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను మండలంలోని జీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన కృష్ణమూర్తికి రూ.60వేలు, టెంకటి గ్రామానికి చెందిన సావిత్రికి రూ.35వేల చెక్కును ఆయన అందజేశారు. ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్నారు. ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట మండల […]

Read More
ఘనంగా ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు

సారథి, పెద్దశంకరంపేట: నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దశంకరంపేటలోని ఎంపీపీ సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ జంగం శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, మాజీ ఎంపీపీ రాజు, .ఎంపీటీసీలు వీణాసుభాష్ గౌడ్, స్వప్నరాజేష్, దామోదర్, సర్పంచ్​లు నాయకులు ప్రకాష్, నరేష్, అశోక్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.

Read More
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సారథి, పెద్దశంకరంపేట: ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జుకల్, సంగారెడ్డిపేట్, కొత్తపేట, శివాయిపల్లి, బూర్గుపల్లి, గొట్టిముక్కుల గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జంగం శ్రీనివాస్, తహసీల్దార్ చరణ్, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, మండల రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్ ప్రారంభించారు. ఆర్ఐ ప్రభాకర్, ఏపీఎం గోపాల్, జుకల్ సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి, సంగారెడ్డి పేట్, సర్పంచ్ రమేష్, కొత్తపేట సర్పంచ్ అనంతరావు, శివాయిపల్లి సర్పంచ్ […]

Read More
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం పెద్దశంకరంపేట పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మహిళా దేశానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. మంచి అవకాశాలు కల్పిస్తే మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తారని అన్నారు. ఆడబిడ్డల వివాహానికి సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష అందిస్తున్నారని […]

Read More
చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవేట్ ​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నారాయణఖేడ్ మండలం పిప్రితండాకు చెందిన మారోని బాయ్ (55)కి బీపీ ఎక్కువై అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె అర్ధరాత్రి సమయంలో చనిపోయింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బంధువులు […]

Read More