సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం, వరంగల్లు, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్కుమార్)బుధవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసు, ప్రభుత్వ ఆస్పత్రి, జడ్పీ హైస్కూలు, కస్తూర్బా విద్యాలయం, మినీ గురుకులంలో విధులు నిర్వహిస్తున్న పట్టభద్రులను కలిశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు ఒకసారి అవకాశమిస్తే భావితరాలకు భరోసాగా నిలుస్తానని, ప్రశ్నించే గొంతుకగా, ప్రజలపక్షాల నిలబడతానని అన్నారు. అంతకుముందు తీన్మార్ మల్లన్న […]
సారథి న్యూస్, వాజేడు, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు అంతా ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య సూచించారు. ములుగు జిల్లా కలెక్టరేట్లో ఆయన ceotelangana.nic.in వెబ్సైట్లో ఆయన స్వయంగా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 6వ తేదీ వరకు పాన్ 18, లేదా పాన్ 19 ద్వారా ఆన్లైన్లో లేదా తహసీల్దార్ఆఫీస్ లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. నవంబర్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ప్రారంభమైన ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా ఓటర్ లిస్టులో తన పేరును మంత్రి కె.తారక రామారావు నమోదు చేసుకున్నారు. ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు తమ పేరును కచ్చితంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. గురువారం వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల ఇన్చార్జ్లతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అక్టోబర్1 నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గ్రామ, మండల నియోజకవర్గాల వారీగా నియమించిన […]
సారథి న్యూస్, ఖమ్మం: రానున్న ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో భాగంగా పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం నాయుడుపేటలోని రామలీల ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్నిర్ణయించిన అభ్యర్థి ఎవరైనా తమ వంతుగా గెలిపించుకోవాలని పాలేరు ఎమ్మెల్యే కందుల ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో […]