సారథి, బిజినేపల్లి: ఆర్ఏహెచ్– యాక్ట్ పథకంలో భాగంగా రాయితీపై లబ్ధిదారులకు గడ్డి కత్తిరించే యంత్రాలను మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని నందివడ్డేమాన్ గ్రామానికి చెందిన నలుగురు, లట్టుపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని ఐదు గ్రామాలు లట్టుపల్లి, నందివడ్డేమాన్, సల్కర్ పేట, వసంతపూర్, వట్టెం గ్రామాలు ఈ పథకానికి ఎంపికైనట్లు వివరించారు. ఈ […]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం మృతులు తండ్రీకొడుకులు బిజినేపల్లి మండల కేంద్రంలో దుర్ఘటన పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి సారథి, బిజినేపల్లి: అతివేగం ఇద్దరి నిండుప్రాణాలను బలితీసుకుంది. రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో తండ్రీకొడుకులు చనిపోయారు. ఈ దుర్ఘటన శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన శివకుమార్ గౌడ్(35), బాలయ్య గౌడ్(65) వట్టెం నుంచి వనపర్తికి వెళ్తున్నారు. అలాగే కోడేర్కు చెందిన […]
సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, చివరి ధాన్యం వరకు ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలుచేస్తుందని భరోసా ఇచ్చారు. వర్షాలు పడుతుండటంతో […]
సారథి, బిజినేపల్లి: కరోనా బాధితులు, వారి కుటుంబాలకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అండగా నిలిచారు. సోమవారం ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తిమ్మాజీపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి, బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ, నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో సరుకులు అందజేశారు. సంబంధిత కుటుంబాల్లో ఎమ్మె్ల్యే ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో […]
గిరిజన విద్యార్థిని మెడిసిన్ చదువుకు ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం రూ.60వేలు అందజేస్తానని హామీ సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మెడిసిన్ చదువుతున్న బిజినేపల్లి మండలంలోని ఉడుగులకుంట తండాకు చెందిన కాట్రావత్శ్యామల అనే విద్యార్థినికి ఎంజేఆర్ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. ఏటా చదువుల కోసం రూ.60వేలు ఇస్తానని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మొదటి సంవత్సరం ఫీజు […]
సారథి న్యూస్, బిజినేపల్లి: కొత్త రెవెన్యూ చట్టం అమలుచేసిన సందర్భంగా బుధవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో సీఎం కె.చంద్రశేఖర్రావు, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, రైతుసంఘం మండలాధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, సర్పంచ్ లు శేఖర్ రెడ్డి, అవంతి, మహేష్ రావు, అశోక్, చందూలాల్, ఎంపీటీసీ బాలస్వామి, […]
సారథి న్యూస్, బిజినేపల్లి: ఓ పేదింటి విద్యాకుసుమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. బిజినేపల్లి మండలంలోని ఉడుగులకుంట తండా గ్రామనికి చెందిన సురేష్ కు ఒడిశాలోని సాంబల్పూర్ ఐఐఎంలో ఎంబీఏ సీటు వచ్చింది. చదవడానికి డబ్బులు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నాడు. తల్లిదండ్రులు, స్థానిక నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే తనవంతు సాయం చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి, […]