Breaking News

medak

క్రమంగా తరలిస్తున్న లేగ దూడల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న లేగ దూడల పట్టివేత

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి నుంచి డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న12 లేగ దూడలను అల్లదుర్గం సీఐ జార్జ్, పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ కలిసి బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రామోజీపల్లి అటవీ ప్రాంతంలో 30లేగ దూడలను తరలించేందుకు పలువురు వ్యక్తులు కట్టివేసి ఉంచారని, అందులో 12 లేగ దూడలను తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఈ విషయంపై కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆవులు, దూడలను తరలిస్తే కఠినచర్యలు […]

Read More
ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి

ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి

నిర్వహణపై అధికారుల తీరు మారాలి గ్రామాల్లో పనులను పరిశీలించిన కలెక్టర్​ హరీశ్​ సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన పెద్దశంకరంపేట మండలంలోని జాంబికుంట, ఆరెపల్లి, కమలాపూర్, బుజ్రన్ పల్లి, కొల్లపల్లి తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను తనిఖీ చేశారు. ఆరేపల్లిలో గోతుల్లో మొక్కలు ఉండకుండా, కలుపు మొక్కలు పెరగడంతో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ […]

Read More
ప్రభుత్వ భూములను కాపాడండి

ప్రభుత్వ భూములను కాపాడండి

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేట పట్టణంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ చరణ్ సింగ్ కు శుక్రవారం ​వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తిరుమలాపూర్ లో సర్వే నంబర్ 1, 256లో భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. వాటిని అక్రమ లేఅవుట్లుగా మార్చి విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రాయని […]

Read More
కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

సారథి, రామాయంపేట: కొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది. సంతోషాల మధ్య శుభకార్యం జరగాల్సిన ఆ ఇంటిలో చావు డప్పు మోగింది. పుస్తెమట్టెలను తీసుకొచ్చేందుకు వెళ్లిన పెళ్లికొడుకు తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని 44వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం.. పులిమామిడి గ్రామానికి చెందిన మందపురం రాజయ్య(55) చిన్నకుమారుడు గణేష్ వివాహం నగరం గ్రామంలో జరగాల్సి ఉంది. పులిమామిడి నుంచి రామాయంపేటకు వచ్చి పుస్తెమట్టెలు […]

Read More
బ్రహ్మకమలాల కనువిందు

బ్రహ్మకమలాల కనువిందు

సారథి, నిజాంపేట: మెదక్ జిల్లా రామాయంపేటలో ఆదివారం సాయంత్రం 8బ్రహ్మకమలాలు వికసించాయి. ఈ పూలను దర్శించిన వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మెదక్ జిల్లా రామాయంపేట 9వ వార్డు పరిధిలో స్థానిక కౌన్సిలర్ దేవుని జయరాజుకు చెందిన మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద ఈ కమలాలు వికసించి కనువిందు చేశాయి. బ్రహ్మకమలం శివుడికి అత్యంత ప్రీతికరమైంది. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని భావిస్తుంటారు. అందులో భాగంగా రామాయంపేటకు చెందిన […]

Read More
జోరుగా ఏరువాక

జోరుగా సాగిన ఏరువాక

సారథి, పెద్దశంకరంపేట/రామాయంపేట: ఏరువాక గురువారం జోరుగా సాగింది. పౌర్ణమి సందర్భంగా రైతులు ఎడ్లబండ్లు, నాగళ్లను మువ్వలు, వివిధ అలంకరణలు చేసి పొలం బాటపట్టారు. పెద్దశంకరంపేట, రామాయంపేట మండలాల్లో రైతన్నలు ఉత్సాహంగా నిర్వహించారు. వ్యవసాయ పనులను ప్రారంభించడానికి ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ శుభదినాన రైతులు, అన్నదాతలకు సిరులపంట పండుతుందని విశ్వాసం. జ్యేష్ఠ శుద్ధపౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తుంటారు. పండుగ రోజున ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు అందమైన రంగులు పూసి, […]

Read More
యేరియా పట్ల జాగ్రత్తగా ఉండాలే

డయేరియా పట్ల జాగ్రత్తగా ఉండాలే

సారథి, రామాయంపేట: గ్రామాల్లో వర్షాకాలంలో డయేరియా లాంటి విషజ్వరాలు ప్రబలకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు. గురువారం ఆమె మండలంలోని జెడ్ చెర్వు గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పల్లెప్రగతి ప్రోగ్రామ్ ద్వారా సీఎం కేసీఆర్ గ్రామాలను బాగుచేయడం కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించారు. యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు గవర్నమెంట్ కొనుగోలు చేసి రైతుల ఖాతాలో జమచేస్తున్నదని […]

Read More
నర్సరీల పరిశీలన

నర్సరీల పరిశీలన

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని బూరుగుపల్లి, కొలపల్లి తదితర గ్రామాల్లో నర్సరీలను ఈజీఎస్ ఏపీవో సుధాకర్ శుక్రవారం పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Read More